Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మనందరికీ సుపరిచితమే. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ గత ఏడాది విడుదలై యావరేజ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుబేర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది.
ఇక ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో పాటు ధనుష్.. రేయాన్ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా హీరో ధనుష్ నటుడు కార్తీక్ కి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఈ హీరో సామాజిక సేవ చేయడంలో ముందు ఉంటాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ధనుష్ ఇంత భారీ మొత్తం కార్తీక్ కి ఎందుకు విరాళం ఇచ్చాడంటే కళాకారుల కోసం. చెన్నైలో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి ఒక కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు ధనుష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.