ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజ హేగ్దే
ఏకంగా స్టార్స్ హీరోస్ తో వరుసగా జత కట్టింది.
చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది పూజ.
ఒక లైలా కోసం, ముకుంద లాంటి మీడియం రేంజ్ సినిమాలు చేసి బాలీవుడ్కు వెళ్లిపోయిన పూజాను ఏరి కోరి ఎంచుకుని ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కథానాయికను చేసి తన కెరీర్ను మలుపు తిప్పాడు హరీష్ శంకర్.
ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా పూజ కెరీయర్కు మాత్రం ఢోకా లేకపోయింది. వరుసగా పెద్ద స్టార్ల సరసన భారీ చిత్రాలతో దూసుకెళ్లింది. కానీ ఈ మధ్యకాలంలో ఈమె చేసిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” “రాధేశ్యామ్” “ఆచార్య” “బీస్ట్” సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. అయినకానీ ప్రస్తుతం ఈమె చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది చాలామంది అభిప్రాయం.
మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న SSMB28 లో ముందుగా పూజ హెగ్డే ను తీసుకున్న సంగతి మనకు తెలిసిందే,
కానీ తాజా సమాచారం ప్రకారం పూజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని వినికిడి.
పూజ స్థానంలో “ప్రియాంక అరుళ్ మోహన్” ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలానే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ చేయబోతున్న “భవదీయడు భగత్ సింగ్” సినిమా నుండి కూడా పూజ తప్పుకుందని, ఆమెకు కాల్షీట్స్ కుదరకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది.