Dil Raju: ప్లాన్ అదుర్స్ సంక్రాంతి సేఫ్ జోన్ ఒకటి పోయిన ఒకటి వర్కౌట్ అవుతుంది

Dil Raju: భగవంతుడికి భక్తుడికి అంబికా దర్బార్ బత్తి అనుసంధానమైనట్టు, సంక్రాంతి సీజన్ కి దిల్ రాజుకి ఒక రకమైన అవినాభావ సంబంధం ఉంది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వచ్చినట్లు ప్రతి సంక్రాంతి సీజన్ కి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా కోట్లను కొల్లగొడుతుంది. ఒక సంక్రాంతి వస్తుంది అంటేనే గత కొన్ని నెలల ముందు నుంచి ఒక సినిమాను సిద్ధం చేస్తారు దిల్ రాజు. ఇక ఈ సంక్రాంతికి కూడా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న టైంలో పూర్తవ్వకపోవడం వలన సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోయారు.

Seethamma Vakitlo Sirimalle Chettu

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు

బేసిగ్గా ప్రతి సంక్రాంతి సీజన్ కు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ బ్యానర్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. చాలా ఏళ్లు తర్వాత ఒక మల్టీ స్టారర్ సినిమాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించి, అద్భుతమైన హిట్ ను తమ ఖాతాలో వేసుకొని మరోసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చేలా తెర తీసారు. ఇద్దరు స్టార్ హీరోలను శ్రీకాంత్ అడ్డాల చాలా పద్ధతిగా డీల్ చేసి, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయి ఒక అందమైన అద్భుతమైన సినిమాను ఈ బ్యానర్ కి అందించాడు. ఈ సినిమాను ఇప్పటికి చూసినా కూడా చూడముచ్చటగా ఉంటుందని చెప్పొచ్చు.

- Advertisement -

 Sathamanam Bhavathi

శతమానం భవతి

సతీష్ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఒక బీభత్సమైన పోటీమధ్య రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుక రిలీజ్ అయింది. అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కూడా సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయింది. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ కు సిద్ధమైన కూడా ఆ రెండు రిలీజ్ అయిన తర్వాత శతమానం భవతి అనే సినిమాను సంక్రాంతి కానుక రిలీజ్ చేశారు దిల్ రాజు. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

F2, వారసుడు

మల్టీ స్టారర్ సినిమాలకు మరోసారి శ్రీకారం చుట్టిన దిల్ రాజు. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్2 అనే సినిమాను నిర్మించారు. పండగ సీజన్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించి 100 కోట్ల మార్కెట్ దాటేసింది. ఇక గత ఏడాది ఓవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, మరోవైపు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలకు పోటీగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన వారసుడు సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.

ఈ సంక్రాంతికి పెద్ద ప్లానింగ్

మొత్తానికి 2024 సంక్రాంతి మిస్సయ్యారు దిల్ రాజు. ఇక 2025 సంక్రాంతికి సరిగ్గా ప్లాన్ చేసుకొని సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాను కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ రెండు సినిమాలు మీద మంచి అంచనాలు ఉన్నాయి. రిజల్ట్ విషయంలో ఒక సినిమా తేడా కొట్టిన కూడా మరో సినిమా సేఫ్ జోన్ లో నిలబడుతుంది అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు