Game Changer : రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు కూతురు..

Game Changer : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ళుగ్సా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక లిరికల్ సాంగ్ తప్ప మరే అప్డేట్ కూడా రాలేదు. కానీ లీక్స్ మాత్రం కుప్పలుగా వచ్చి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తున్నాయి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా శంకర్ ఇండియన్ 2 వల్ల లేట్ అవుతుందని తెలిసిందే. ఆగిపోయిన కమల్ శంకర్ ల సినిమా మళ్ళీ మొదలు పెట్టడంతో చరణ్ గేమ్ ఛేంజర్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. క్రమంగా లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రావాల్సిన గేమ్ ఛేంజర్ (Game Changer) ఈ ఇయర్ సమ్మర్ ని కూడా దాటుకుని రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇటు దిల్ రాజు మాత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. అప్పుడు ఇప్పుడూ అంటూ కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారు. ఇటు మెగాభిమానులు మాత్రం సోషల్ మీడియాలో దిల్ రాజును ట్రోల్ చేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.

Dil Raju's daughter gave clarity on the release of the game changer

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు కూతురు..

ఇదిలా ఉండగా దిల్ రాజు ఆ మధ్య థియేటర్లో సినిమా చూసి బయటికి వస్తున్నపుడు గేమ్ ఛేంజర్ అప్డేట్ అడిగితే సెప్టెంబర్ లో రావొచ్చని అన్నాడు. మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. బహుశా శంకర్ ఇండియన్2 పైనే ఫోకస్ పెట్టడంతో దిల్ రాజుకే ఏమి చెప్పలేని పరిస్థితి. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ పై దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హన్షిత రెడ్డి ని మీడియా వారు గేమ్ ఛేంజర్ అప్డేట్ అడిగారు. దానికి ఆమె గేమ్ ఛేంజర్ ఒక డిఫరెంట్ స్టోరీగా తెరకెక్కుతోందని, అన్నీ కుదిరితే గేమ్ చేంజర్ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

- Advertisement -

భారీ తారాగణంతో గేమ్ చేంజర్..

ఇక గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్” (Game Changer) ను శంకర్ షణ్ముగం తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్, జయరాం,ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీ రామ్ పాటలు రాస్తున్నారు. జూన్ లో రెండో లిరికల్ సాంగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా తుదిదశకు చేరుకోగా, ఇండియన్2 రిలీజ్ కాగానే గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలు పెడతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు