Dakshina : టాలీవుడ్ లో మంత్ర, మంగళ వంటి హారర్ సినిమాలతో అలరించిన దర్శకుడు “ఓషో తులసీరామ్”. చాలా ఏళ్ళ తరవాత మళ్ళీ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తీసిన సినిమా “దక్షిణ”. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. వివరాల్లోకి వెళితే.. ‘కబాలి’ మూవీలో రజనీకాంత్ కూతురిగా కీలక పాత్రలో నటించి తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ అయ్యింది సాయిధన్సిక. కబాలి క్రేజ్తో టాలీవుడ్లోనూ పలు సినిమాలు చేసింది. ఇప్పుడు త్వరలో “దక్షిణ” అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సాయిధన్సిక. దక్షిణ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని మంత్ర ఫేమ్ ఓషో తులసిరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజా “దక్షిణ” (Dakshina) ట్రైలర్ను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన విడుదల చేశారు.
క్రైమ్ ఇన్వస్టిగేట్ ఆఫీసర్ గా ధన్సిక!
ఇక తాజాగా రిలీజ్ చేసిన దక్షిణ ట్రైలర్ లో మహిళలను హత్య చేసి, వారి తలల స్థానంలో క్వశ్చన్ మార్క్ పెడుతోన్న ఓ సైకో కిల్లర్ పాయింట్తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ మొదలైంది. ఈ ట్రైలర్లో సీరియల్ మర్డర్స్ వెనుకన్న సీక్రెట్ను రివీల్ చేసే పోలీస్ ఆఫీసర్గా, నెగెటివ్ షేడ్స్తో కూడిన రఫ్ లుక్లో సాయిధన్సిక కనిపిస్తోంది. ఆమె క్యారెక్టర్లోని వేరియేషన్స్ ఆసక్తిని పంచుతోన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే రాక్షసుడు మూవీ తరహా లో ఉంది అని తెలుస్తుంది. ఇక దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోందని త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ, ఈ మధ్య కాలం లొ తనను ఎక్కువగా భయపెట్టింది ఈ దక్షిణ ట్రైలర్ అని చెప్పాడు. తులసిరామ్కు మంచి కమ్ బ్యాక్ మూవీగా సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న దక్షిణ మూవీ నిలవాలని అన్నారు.
ఓషో తులసి రామ్ దక్షిణ తో కం బ్యాక్ ఇస్తాడా?
ఇక టాలీవుడ్ లో మంత్ర అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు ఓషో తులసిరామ్. సరిగ్గా పదహేడేళ్ల కింద టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి, శివాజీ, అలాగే హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన “మంత్ర” మూవీతో డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఓషో తులసిరామ్. 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఛార్మికి మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. వరుస పరాజయాల్లో ఉన్న శివాజీ కెరీర్ను గట్టెక్కించింది. ఆ తర్వాత మంత్ర మూవీకి సీక్వెల్లో ఛార్మితోనే ‘మంగళ’ మూవీ చేశాడు ఓషో తులసిరామ్. కానీ ఆ సినిమా పరాజయం పాలయింది. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమా చేయలేదు తులసీరామ్. ఇక ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడిగా మారి ధన్సిక తో దక్షిణ (Dakshina) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావోతున్నాడు. ఈ సినిమాని జులై లో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.