Double Ismart : పూరికి ఈ కష్టాలెంటో… ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం..?

Double Ismart :ఈ ఆగష్టు కు సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే.. అందులో అందరి దృష్టి రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉంది.. కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఈ సినిమా రాబోతుంది. హీరో రామ్ తో గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నా కష్టాలు మాత్రం వెన్నంటే ఉంటున్నాయి. ఒకటీపోతే మరొకటి సినిమాకు అడ్డుగా నిలుస్తున్నాయి.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

పూరికి,హీరోతో గొడవలు..

పూరి జగన్నాథ్ మాములుగా హీరోలతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఎప్పుడు ఎవరితో గొడవలు వచ్చాయని వార్తలు వినిపించలేదు. కానీ ఇప్పుడు రామ్ తో గొడవలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్.. షూటింగ్ విషయంలో వీరిద్దరి మధ్య చాలాసార్లు గొడవలు అయ్యాయాని సమాచారం. అందుకే సినిమాకు ప్రమోషన్స్ పెద్దగా చెయ్యకుండానే రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో పూరి ఉన్నట్లు సన్నిహిత వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. దీనిపై పూరి, డైరెక్టర్ ఎవరు స్పందించలేదు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

What is this trouble for Puri... Confusion over the pre-release event..?
What is this trouble for Puri… Confusion over the pre-release event..?

డిస్టిబ్యూటర్స్ తో వివాదం..

పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేశాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో సినిమా డిస్టిబ్యూటర్స్ నష్టాన్ని భర్తీ చెయ్యాలని గత కొన్ని నెలలుగా గొడవలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఫిలిం ఛాంబర్ పెద్దలు జ్యోక్యం చేసుకొని వివాదాలకు చెక్ పెట్టినా ఇంకా గొడవలు ఆగినట్లు కనిపించలేదు. ఇది పూరికి పెద్ద తల నొప్పిగా మారింది..

- Advertisement -

ప్రీ రిలీజ్ ఈవెంట్..

డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సాంగ్ ఓ రేంజ్ లో వ్యూస్ ను రాబట్టింది. ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి.. ఈ ఈవెంట్ ను ఈనెల 10లేదా 11 తేదీల్లో వరంగల్ లో నిర్వహించాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట.. కానీ గెస్టుగా ఎవరు రాలేదని వార్త ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి రావచ్చు అనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు రావాలన్నా హైదరాబాద్ లో అయితేనే వస్తారు. వరంగల్ లో అయితే రావడం కష్టమే.. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదన్నమాట..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు