Prabhas: నిర్మాత అశ్విని దత్ ప్రభాస్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు తెలుసా.?

Prabhas: ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ ను సాధించలేకపోయింది. శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఈ సినిమాని రీసెంట్ గా రీ రిలీజ్ చేసిన కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. త్రిష ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ, గోపీచంద్ విలనిజం ఇవన్నీ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించి ప్రభాస్ ను స్టార్ హీరో చేసేసింది. ప్రభాస్ చేసిన సినిమాల్లో ఇప్పటికి ఛత్రపతి సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇకపోతే ప్రభాస్ తన కెరియర్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వివాదాలు దూరంగా బతుకుతూ ఉంటారు. చాలామంది ప్రభాస్ ని ఇండస్ట్రీలో డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. పూరి జగన్నాథ్ ప్రభాస్ ఒరిజినల్ క్యారెక్టర్ని చాలాసార్లు చెబుతూ వచ్చాడు. ప్రభాస్ తో పని చేసిన ప్రతి దర్శకులు కూడా ప్రభాస్ ని ఈజీగా ఇష్టపడుతుంటారు.

Varsham

- Advertisement -

ఒక సినిమాకి దాదాపు 5 సంవత్సరాలు టైం ఇవ్వడమనేది ప్రభాస్ మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెడతారు. ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు ప్రభాస్. అయితే కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎమ్మెస్ రాజు నిర్మించిన వర్షం సినిమా అప్పటినుంచి ప్రభాస్ తో పనిచేయాలని నిర్మాత అశ్విని దత్ అనుకున్నారట. అయితే కల్కి సినిమాను నాగ అశ్విన్ వచ్చి ప్రభాస్ తో చేస్తున్నాము అని చెప్పినప్పుడు నా కల నెరవేరింది అని అశ్విని ఫీలయ్యారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు