Double Ismart :తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ సినిమా ఇప్పటివరకు పూరి జగన్నాద్ చేయలేకపోయారు. దీనికి పలు రకాలైన కారణాలు ఉండొచ్చు. అయితే పూరి జగన్నాథ్ ఒక హిట్ సినిమా చేస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. సాధారణంగా హీరోలకు అభిమానులు ఉండడం మామూలే, కానీ ఒక దర్శకుడుకి కూడా అభిమానులు ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ కి మాత్రమే చెల్లింది అని చెప్పొచ్చు. ఎస్.ఎస్ రాజమౌళి కంటే ముందు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను సాధించుకున్నారు.
ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే బద్రి సినిమాతోనే తన ఇంపాక్ట్ ఏంటో తెలియజేశాడు. ఆ తర్వాత చేసిన ఇడియట్(Idiot), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం(Itlu Sravani Subramanyam), అమ్మ నాన్న తమిళ అమ్మాయి(Amma Nanna O Tamil ammai), పోకిరి(Pokiri) వంటి ఎన్నో హిట్ సినిమాలు పూరి జగన్నాథ్ ను ఒక స్థాయిలో నిలబెట్టాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ ఒక హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. అయితే పూరి జగన్నాథ్ కి అభిమానులు ఉండటం అనేది సహజం. అని ఎంతో పేరును సాధించిన విజయేంద్ర ప్రసాద్ వంటి టాప్ రైటర్స్ కూడా పూరి జగన్నాథ్ ను విపరీతంగా అభిమానిస్తారు.
విజయేంద్రప్రసాద్ చాలా ఇంటర్వ్యూస్ లో పూరి జగన్నాథ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో అవతల విలన్ కి కూడా కోపం తెప్పించగలడు అని చాలా ఉదాహరణలు చెప్పారు విజయేంద్రప్రసాద్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన వారం రోజుల తర్వాత పూరి జగన్నాథ్ కి కాల్ చేశారు విజయేంద్రప్రసాద్. సార్ మీరు నెక్స్ట్ సినిమా చేస్తే ఆ కథ నాకు ఒకసారి చెబుతారా అని అడిగారట. దీనికి కారణం పూరీ జగన్నాథ్ ను విజయేంద్రప్రసాద్ ఎంతగా అభిమానిస్తున్నారు చెప్పడమే. అయితే పూరి జగన్నాథ్ విజయేంద్ర ప్రసాద్ కి కథ చెప్పకుండానే డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను చేశారు.
నేడు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే సోషల్ మీడియా వేదికగా చాలామంది పూరి జగన్నాథ్(Puri Jagannadh) ను అభిమానించిన వాళ్లు కూడా మీకు మళ్ళీ ఇంకొక సినిమా చేసే ఉద్దేశం ఉంటే దయచేసి ఒకసారి విజయేంద్ర ప్రసాద్ ని కలవండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇస్తాడు అనుకున్న పూరి దీంతో కూడా డిసప్పాయింటెడ్ చేశారు అంటూ మెజారిటీ పీపుల్ చెబుతున్నారు.