Double Ismart: త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్..!

Double Ismart.. ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. అత్యధిక బడ్జెట్ తో పవర్ఫుల్ కాంబినేషన్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆడియన్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. రామ్ కి జోడిగా ఇందులో కావ్య థాపర్ నటిస్తున్న విషయం తెలిసిందే. మెంటల్ మాస్ మాడ్ నెస్ లోడింగ్, డబుల్ ఇస్మార్ట్ థియేటర్ ట్రైలర్ ఆగస్టు 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం గత రెండు రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ట్రైలర్ పోస్టర్లో రామ్ పోతినేని ఇంటెన్స్, మాస్ అప్పీల్ లుక్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామ్ కమాండింగ్ ప్రెసెన్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

Double Ismart: Pre-release event coming soon.. Pan India star as chief guest.!
Double Ismart: Pre-release event coming soon.. Pan India star as chief guest.!

ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ విడుదల..

ఇస్మార్ట్ శంకర్ కి మించి ఈ సినిమా ఉండబోతుందని అయితే పోస్టర్ ద్వారా మనకు అర్థమవుతుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాస్ట్రో స్టార్ మణిశర్మ సంగీతం అందించారు. శ్యామ్ కే నాయుడు, జియాని జియాన్నెలీ సినిమా ఆటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇండిపెండెన్స్ డే కి సినిమా విడుదల కాబోతుండడంతో.. ఫ్యాన్స్ లో మరింత ఎక్సైట్మెంట్ పెరిగిపోయిందని చెప్పవచ్చు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్..

ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక అందులో భాగంగానే 15వ తేదీ సినిమా విడుదల కానన్న నేపథ్యంలో ఆగస్టు 13 లేదా 14వ తేదీలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిజ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సినిమాపై మరింత హైప్ పెంచడానికి చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు రాబోతున్నారు? అనే విషయాలు అభిమానులలో తలెత్తుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

- Advertisement -

ప్రభాస్ సినిమాలు..

ఇక ప్రభాస్ విషయానికొస్తే.. గత ఏడాది సలార్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన ఇప్పుడు కల్కి 2898AD సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఏకంగా రూ .1200 కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈరోజు నుంచి మరో వారం రోజులపాటు దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 100 రూపాయల కే టికెట్ అని చిత్ర బృందం ప్రకటించింది. ఇలా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తమ సినిమాకు గెస్ట్ గా వస్తే హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని, మేకర్స్ భావించినట్లున్నారు. అందుకే ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి త్వరలోనే నిజా నిజాలు తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు