Dulquer Salman : మరో రెండు తెలుగు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన దుల్కర్.. మాంచి ఊపుమీదున్నాడుగా..

Dulquer Salman : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే అది మలయాళంలో కాదు తెలుగులో. ఇప్పుడు మలయాళం కంటే తెలుగు ప్రాజెక్టులని లైన్లో పెట్టడం విశేషం. ఇక మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి తనయుడిగా మూవీ లవర్స్ కి సుపరిచితుడైన దుల్కర్ మహానటి తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ తర్వాత వరుస డబ్బింగ్ సినిమాలని తెలుగులో దించగా, తెలుగులో రెండేళ్ల కింద చేసిన సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి టాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో మంచి పాపులారిటీ సంపాదించాడు. సీతారామం చిత్రంతో వచ్చిన ప్రజాదరణ వల్లో ఏమో తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. ఇప్పటికే లక్కీ భాస్కర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు దుల్కర్. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కి వచ్చేయగా, త్వరలో ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను తెలుగులో చేయనున్నాడని తెలుస్తుంది.

Dulquer Salman has lined up two Telugu projects

రెండు తెలుగు సినిమాలు లైన్లో పెట్టిన దుల్కర్…

అయితే దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో రెండు తెలుగు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి SLV సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడని నిర్మాత అశ్వినీదత్ కంఫర్మ్ చేసాడు. ఇక ఈ సినిమాకు పవన్ సాధినేని డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. అంటే ఇప్పుడు వరుసగా దుల్కర్ నుండి మూడు తెలుగు సినిమాలు రానున్నాయన్నమాట.

- Advertisement -

మలయాళం కంటే తెలుగుపైనే ఫోకస్..

ఇక దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ప్రస్తుతం మలయాళ ప్రాజెక్టులు ఇంకా ఏవి చేయట్లేదని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ‘కింగ్ అఫ్ కోత’ సినిమాతో ప్లాప్ అందుకున్న దుల్కర్ ఆ తర్వాత మలయాళ ప్రాజెక్టులు హోల్డ్ లో పెట్టాడని టాక్. ప్రస్తుతం మొత్తం తెలుగులో లక్కీ భాస్కర్ నే చేస్తుండగా, ఈ సినిమా రిలీజ్ అయ్యాకే, మలయాళం మరియు తెలుగు సినిమాల అనౌన్స్ మెంట్ చేస్తాడని సమాచారం. ఇక లక్కీ భాస్కర్ సినిమాను వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు