Eleven Teaser.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగిన అతి తక్కువ మంది నటులలో నటుడు నవీన్ చంద్ర కూడా ఒకరు.. హీరోగా, విలన్ గా.. సపోర్టింగ్ రోల్స్ లో కూడా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించిన నవీన్ చంద్ర.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు. నవీన్ చంద్ర ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలలోనే నటిస్తూ ఉంటారు. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. తాజాగా తాను లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం లెవన్. ఈ చిత్రం కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ లోకేష్ అజిల్స్. తాజాగా కొన్ని నిమిషాల క్రితం చిత్ర బృందం టీజర్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది.
లెవెన్.. టీజర్ తోనే ఆకట్టుకున్న నవీన్ చంద్ర..
టీజర్ విషయానికి వస్తే.. ఒక కేసు విషయమై హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నట్టుగా ఈ టీజర్ చూపించారు. వరుస హత్యలు చేస్తున్నటువంటి హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరొకసారి నవీన్ చంద్ర కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు ?హత్యలు ఎందుకు చేస్తున్నారు? అనే క్రమంలో ఈ సినిమా సాగుతున్నట్లుగా ఈ టీజర్ చూస్తే మనకి అర్థమవుతుంది. చివర్లో “ఎలుకలు తిన్న పాముకు తెలియదు.. తనను ఎత్తుకెళ్లడానికి గద్ద వస్తుందని” అనే డైలాగ్ తో టీజర్ మొత్తం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి టీజర్ తోనే లెవన్ సినిమా హైప్ ను పెంచేస్తున్నారు చిత్ర బృందం. టీజరే ఇంత ఆసక్తికరంగా సాగుతోంది అంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
నవీన్ చంద్ర కెరియర్..
కర్ణాటక కుర్రాడు.. బళ్లారి వాసి అయిన నవీన్ చంద్ర.. రామారావు , మాధవి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి సినిమాల పైన ఆసక్తి పెంచుకున్న నవీన్ చంద్ర.. అవకాశం లభిస్తే చాలు స్కూలింగ్ , కాలేజ్ టైమ్ లలో స్టేజ్ పర్ఫామెన్స్ ఇస్తూ అలరించేవారు.. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. అక్కడ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకొని తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. తెలుగులో అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన నవీన్ చంద్ర.. త్రిపుర వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తన అద్భుతమైన నటనతో 2024లో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. 2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారానే ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు లెవెన్ అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.