FC-Ormax Power List 2024 : ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రి

FC-Ormax Power List 2024 : FC-Ormax సంస్థ తాజాగా 2024 పవర్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్‌ల పేర్లను ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క తెలుగు నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ చరిత్రను సృష్టించింది. నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ యాజమాన్యంలోని మైత్రీ మూవీ మేకర్స్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ నిర్మాణ రంగంతో పాటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా దూసుకెళ్తోంది.

మైత్రి ఖాతాలో అరుదైన ఘనత

FC-Ormax 2024 పవర్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్‌లలో మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే చోటు దక్కించుకుంది. ఎన్నో నిర్మాణ సంస్థలు టాలీవుడ్ లో దశాబ్దాల నుంచి రాజ్యామేలుతున్నా, ఇటీవల కాలంలో మైత్రి అన్ని నిర్మాణ సంస్థలకు ధీటుగా నిలుస్తోంది. 2015లో శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసినప్పటి నుండి, మైత్రీ మూవీ మేకర్స్ జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి హిట్‌లతో భారతదేశంలోని అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా మారింది. కేవలం తొమ్మిదేళ్లలో ఇండస్ట్రిలో టాప్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది.

2023లో ఈ ప్రొడక్షన్ హౌస్ చిరంజీవి, బాలకృష్ణ హీరోలుగా నటించిన సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే పుష్ప, ఉప్పెన వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన, జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాలను కూడా నిర్మించారు మైత్రి వారు. అంతేకాదు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ యాజమాన్యంలో మైత్రీ మూవీ మేకర్స్ మలయాళ ఎంట్రీకి కూడా ఇచ్చింది. నడికర్ అనే సినిమాతో మాలీవుడ్ మార్కెట్ లో పాగా వేసింది. సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి కూడా అడుగు పెడుతున్నారు. తల అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా నిర్మాణం చేపట్టి కోలీవుడ్ లో కూడా అతి పెద్ద నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశ్వవ్యాప్తంగా ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో మైత్రి నిర్మాతలకు ఉన్న నేర్పు వారికి ప్రతిష్టాత్మకమైన FC-Ormax పవర్ లిస్ట్‌లో స్థానం సంపాదించి పెట్టింది. ఇది భారతీయ చలనచిత్రంలో పెరుగుతున్న వారి ప్రభావానికి నిదర్శనం.

- Advertisement -

Mythri Movie Makers : Only Telugu Production Banner On The List of FC-Ormax! - TeluguBulletin.com

మైత్రి మూవీ మేకర్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్

కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి, రామ్ చరణ్ – బుచ్చిబాబు వంటి ఆసక్తికరమైన కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. అలాగే మైత్రి పైప్‌లైన్‌లో మరికొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌ లు కూడా ఉన్నాయి. మైత్రి రాబోయే ప్రాజెక్ట్‌లలో అల్లు అర్జున్ – సుకుమార్‌ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. తెలుగులో ఇన్ని ప్రాజెక్టులు మైత్రి చేతిలో ఉండగా, తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, హిందీలో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని హిందీ మూవీలను కూడా నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు