Mamta Mohandas:ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను.

మలయాళీ కుట్టి మమతా మోహన్ దాస్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా నటించడంతోపాటు ఇంకా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యమదొంగ, చింతకాయల రవి, కేడి, కింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాలలో ఓ మెరుపు మెరిసి.. ఒక్కసారిగా మాయమైంది. 2010 లో నాగార్జున కేడి చిత్రం తర్వాత ఈమె మళ్లీ కనిపించలేదు.

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ భారిన పడ్డట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం మమత “రుద్రాంగి” అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది.ఇదిలా ఉంటే క్యాన్సర్ తో పోరాడి తిరిగి వచ్చిన మమత మోహన్ దాస్ మరోసారి లింఫోమా అనే వ్యాధితో పోరాడి కోలుకుందట. ఈ రెండు భయంకరమైన వ్యాధులను జయించిన ఈ నటికీ తాజాగా మరో వ్యాధి సోకిందని ఈ విషయాన్ని స్వయంగా మమత మోహన్ దాస్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

ప్రస్తుతం బొల్లి అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. చర్మం రంగు కోల్పోయే విటలిగ్ అనే క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ తో బాధపడుతున్నట్లు తెలిపింది. అలాగే తన ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ చేసింది. ” డియర్ సన్ నీ కిరణాలను చూడడానికి నీ కంటే ముందే నిద్ర లేస్తున్నాను. నీ శక్తిని అంతా నాకు ఇవ్వండి. ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ ని చూసిన స్నేహితులు, అభిమానులు మీరు క్యాన్సర్ ని జయించినట్లే ఇప్పుడు కూడా ఈ వ్యాధిని జయించాలని.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు