Kalki2898AD : కల్కి అంతర్జాతీయ స్థాయి సినిమా – ఎం. వెంకయ్య నాయుడు

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా, అన్ని భాషల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే కల్కి 1000 కోట్ల మార్క్ ని అందుకోగా, మరిన్ని అరుదైన రికార్డులను సాధిస్తుంది. ఇక ప్రభాస్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రల వైవిధ్యం కూడా తోడు కావడంతో భారీ కలెక్షన్లు లభించాయి. ఇక కల్కి సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కావడమే కాకుండా 130 కోట్లకి పైగా లాభాలు అందుకుని మరింత ముందుకు దూసుకుపోతుంది. ఇక తెలుగులో RRR, బాహుబలి 2 తర్వాత అత్యధిక లాభాలు అందుకున్న సినిమాగా కల్కి నిలిచింది.

Former Vice President Venkaiah Naidu praised the Kalki2898AD film unit

కల్కి కి ప్రముఖుల ప్రశంసలు..

ఇక కల్కి సినిమాకు దేశంలోని ఎంతో మంది సెలెబ్రిటీలు, ప్రముఖులు ఈ సినిమాని చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తూ అభినందనలు తెలియచేసారు. తాజాగా మరో రాజకీయ ప్రముఖులు కల్కి సినిమా చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన కల్కి చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత కూడా థియేటర్లలో మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక కల్కి సినిమాను రీసెంట్ గా చూసిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ని అభినందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కల్కి అంతర్జాతీయ సినిమా..

కల్కి చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా లో ఇలా చెప్పుకొచ్చారు… శ్రీ నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో శ్రీ అశ్వినీ దత్ గారు నిర్మించిన కల్కి 2898 ఎ.డి చలనచిత్రాన్ని ఈరోజు వీక్షించాను. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో, మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించింది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే తదితర భారీ తారాగణంతో రూపొందించిన ఈ చలనచిత్ర నిర్మాణం హాలీవుడ్ నిర్మాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా. దర్శకుడు శ్రీ నాగ్అశ్విన్, నిర్మాత శ్రీ అశ్వినీ దత్ సహా ఈ చలనచిత్ర రూపకల్పనలో పాలు పంచుకున్న భాగస్వాములందరికీ అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని షేర్ చేస్తూ సంతోష పడుతున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా ఈ ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ వేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు