Gayatri Gupta: బిగ్ బాస్ పై హాట్ బాంబ్.. ఆడిషన్ పేరుతో ట్రాప్ చేస్తారు..!

Gayatri Gupta.. గాయత్రీ గుప్తా.. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు.. తాజాగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పై గతంలోనూ ఇప్పుడు ఈమె కామెంట్లు చేయడం సంచలనంగా మారిందనే చెప్పాలి.. కొంతమంది హీరోయిన్స్ ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి షాక్ ఇచ్చిన ఈమె అలాగే బేబీ సినిమా కాపీ చేశారని అంతకుముందు తననే హీరోయిన్గా ఎంపిక చేసుకుంటామని స్కూల్ డ్రెస్ లో ఫొటోస్ స్టిల్స్ కూడా తీశారని.. ఆ తర్వాత బేబీ డైరక్టర్ సాయి రాజేష్ మోసం చేశారని చెప్పుకొచ్చింది.. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ గేమ్ షోపై షాకింగ్ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది గాయత్రి గుప్తా..

బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేసిన గాయత్రి గుప్తా..

Gayatri Gupta: Hot bomb on Bigg Boss.. Trapped in the name of audition..!
Gayatri Gupta: Hot bomb on Bigg Boss.. Trapped in the name of audition..!

గతంలో కూడా బిగ్ బాస్ ఆడిషన్స్ పైన మాట్లాడిన.. ఈమె తాజాగా మరొకసారి ఒక ఇంటర్వ్యూలో ఈ షో గురించి కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసింది… గతంలో గాయత్రి కి బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందట. కానీ విభేదాల కారణంగా ఆమె ఈ షో కి వెళ్లలేదని కూడా తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ పై మరొకసారి ఈమె షాకింగ్ కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో కి వెళ్లాలంటే ముందుగా వారు ఇచ్చే కాంట్రాక్టు పైన సంతకం చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి.. ముఖ్యంగా వాటన్నింటికీ మనం ఓకే చెప్పిన తర్వాతనే బిగ్ బాస్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది.. అందులో భాగంగానే బిగ్ బాస్ కి ఓకే అయిన తర్వాత ఎటువంటి సినిమాలు కూడా ఒప్పుకోకూడదు.. ఈ కారణంతోనే నేను దాదాపు 15 సినిమాలను వదులుకున్నాను.. కానీ ఏమైందో తెలియదు కానీ సడన్ గా బిగ్ బాస్ నుంచి నన్ను తీసేశారు. దాంతో నాకు చాలా నష్టం కలిగింది.. నష్టపరిహారం కోసం కోర్టుకు కూడా వెళ్లాను..

బిగ్ బాస్ లో ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను ట్రాప్..

బిగ్ బాస్ లో ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను మాత్రం హోటల్స్ కి తీసుకువెళ్తారు అంటూ చెప్పింది గాయత్రి గుప్తా.. ఇకపోతే తనకు నాగార్జున పైన ఎటువంటి వ్యతిరేకత లేదు అని కేవలం షో నిర్వాహకుల మీద మాత్రమే తాను పోరాడుతున్నాము అని కూడా తెలిపింది.. ముఖ్యంగా బిగ్ బాస్ పై కోర్టుకు వెళ్లడంతోనే రూల్స్ కూడా చాలా మారాయి అని బిగ్ బాస్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా అందిస్తున్నారు అంటూ తెలిపింది గాయత్రి గుప్తా.. ప్రస్తుతం ఈ విషయం బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది తనకు చెప్పారు అని గాయత్రి గుప్తా చెప్పుకొచ్చింది.. ఇక ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మొత్తానికి అయితే గాయత్రి గుప్తా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు