Gnanavel Raja: మరో పాన్ ఇండియా సినిమా కూడా పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Gnanavel Raja: సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ను మొదలుపెట్టి సౌర్యం సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ హీరోగా శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత సిరితై అనే సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో రవితేజ హీరోగా దరువు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు శివ.

ఇకపోతే తమిళ్లో అజిత్ హీరోగా వీరం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శివ కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. డాలి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత శివ చేసిన వేదాళం సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను బోలా శంకర్ పేరుతో చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఇక్కడ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వివేగం, విశ్వాసం సినిమాలు కూడా అక్కడ బాగానే ఆడాయి. ఇక ప్రస్తుతం సూర్య హీరోగా కంగువ అనే సినిమాను చేస్తున్నాడు శివ.

హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి అభిమానులు సూర్యకు ఉన్నారు. సూర్య చేసిన ఎన్నో సినిమాలను ఆదరించారు. ఇప్పుడు సూర్య చేస్తున్న కంగువ సినిమా గురించి కూడా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.

- Advertisement -

Kanguva

రీసెంట్ టైమ్స్ లో సినిమాలన్నీ రెండు పార్ట్లుగా వస్తున్నాయి. కంగువ సినిమాకి సంబంధించి కూడా పార్ట్ రాబోతున్నట్లు నిర్మాత జ్ఞానవేల్ రాజా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. పార్ట్ వన్ సినిమా బాగా వచ్చిందని పార్ట్ వన్ కంటే కూడా పార్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ జ్ఞానవేల్ రాజా రివీల్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు