Gopichand : ‘భీమా’ రచ్చకు ముహూర్తం ఫిక్స్..

మ్యాచో స్టార్ ‘గోపిచంద్’ భీమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. గత వారం రోజులుగా ఈ సినిమా నుండి ఏదో అప్డేట్ ఇస్తూ మేకర్స్ సందడి చేస్తుండగా, గోపిచంద్ వరుసగా ప్రమోషన్ టూర్లు కూడా వేస్తున్నారు. ఈ మధ్యనే విజయవాడ, గుంటూరులో కాలేజ్ లలో బీమాను ప్రమోట్ చేసిన గోపీచంద్ ఇక హైదరాబాద్ లో కూడా త్వరలో ప్రమోట్ చేయనున్నాడు. మార్చి 8న రిలీజ్ అవుతున్న “భీమా” సినిమా పై ఇప్పటికే మంచి క్రేజీ అంచనాలు ఉండగా, దాన్ని రెట్టింపు చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. పైగా గోపీచంద్ కు కూడా ఇప్పుడు ఒక భారీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వక తప్పనిసరి. అందుకే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రమోషన్ టూర్లు, లేకపోతే ఇంటర్వ్యూలు, వీలైతే సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా రిలీజ్ అయిన ఇంట్రో సాంగ్ గోపీచంద్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ అందిస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చేసింది. భీమా ట్రైలర్ ను ఫిబ్రవరి 24న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గోపీచంద్ బ్యాక్ గ్రౌండ్ చూపిస్తూ, దూరంగా ఒక టెంపుల్ ని కూడా చూపించడం జరిగింది. దీన్ని బట్టి ఈ సినిమాలో టెంపుల్ నేపథ్యానికి కథను లింక్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటో అన్న దానిపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఇక భీమా సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించగా, ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మించడం జరిగింది. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. కెజిఎఫ్ ఫేమ్ రావ్ బాసూర్ సంగీతం అందించాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు