HBD VijayaShanthi.. టాలీవుడ్ లో గతంలో హీరోయిన్ గా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ విజయశాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే..గ్లామర్ పాత్రలో కాదు ఎలాంటి పాత్రలోనైనా సరే విజయశాంతి నటనకు సాటి రారు. విజయశాంతి కెరీర్ కు హీరో గోపీచంద్ తండ్రి టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ముఖ్యంగా అప్పట్లో శ్రీదేవి , జయసుధ, మాధవి తదితర హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీను ఏలుతున్న సమయంలోనే విజయశాంతి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి హీరోయిన్లకు దీటుగా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి విజయకేతనం ఎగరేసింది. ఈ రోజున విజయశాంతి 58వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.
విజయశాంతి భర్త ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావ్ కి స్వయానా మేనల్లుడు..
![HBD VijayaShanthi: Is this the relationship between VijayaShanti's husband and the Nandamuri family?](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/06/Untitled-2024-06-24T133900.833.jpeg)
విజయశాంతి తన సినీ కెరియర్ లో ఎక్కువగా కృష్ణ, బాలయ్య , చిరంజీవి వంటి హీరోలతో నటించింది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది విజయశాంతి. అయితే విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు… ఈయనకు నందమూరి కుటుంబం తో కూడా బంధుత్వం ఉన్నదట. విజయశాంతి భర్త ప్రసాద్.. ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు అవుతారట.. గణేష్ రావుకి బాలకృష్ణ మంచి స్నేహితుడట. ఈ స్నేహ బంధంతోనే బాలయ్యతో ఒక సినిమాను కూడా నిర్మించాలనుకున్నారు. అందులో భాగంగా నిప్పురవ్వ సినిమాని కూడా తెరకెక్కించారు.
విజయశాంతితో సినిమా నిర్మించిన శ్రీనివాస్ ప్రసాద్
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడానికి చాలామంది పేర్లు వినిపించినా.. చివరికి ప్రసాద్ విజయశాంతి పేరును సూచించారట. అలా నెమ్మదిగా వీరి మధ్య స్నేహం పెరిగి.. ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే నిప్పురవ్వ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. బాలయ్య – విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన చిట్టచివరి సినిమా కూడా ఇదే. అలా కొద్ది రోజులకి విజయశాంతి తల్లిదండ్రులు మరణించడంతో ఆమెకు దగ్గరుండి మరి అన్ని ప్రసాద్ చూసుకునేవారట.
వివాహం జరిగిన కొన్నాళ్ళకే విడాకులు..
అలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదిరి వివాహం చేసుకున్నారు. అయితే అలా వివాహం చేసుకున్న కొన్నేళ్ళకే వీరి కాపురం సాఫీగా సాగినా.. కొన్ని కారణాల చేత వీరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. విజయశాంతి పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇచ్చినా..పెద్దగా ఈమెకు ఎక్కడ కలిసి రాలేదని కనిపిస్తోంది. విజయశాంతి భర్త ప్రసాద్ మాత్రం ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా విజయశాంతి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలలో నటించేందుకు ఇష్టపడుతోంది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమా తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ 21వ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.