Hema: హేమ గారికి కొత్త రెసిపీ చేసే అవకాశం లేదు, కోర్టుకు హాజరు కావాల్సిందే.!

Hema: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీమణిలలో హేమ ఒకరు. ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకుంది హేమ. చాలామంది స్టార్ హీరోస్ సినిమాలో కూడా కనిపించింది. హేమకు సినిమాలతో ఎంత గుర్తింపు వచ్చిందో వివాదాలతో కూడా అంతే గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. హేమ నిజంగానే అలా ఉంటారో లేకపోతే ఆమె ముక్కుసూటి తనం వలన అలా అనిపిస్తారో తెలియదు కానీ, చాలామంది హేమ కు నెగిటివ్ మాట్లాడేవారు ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మంది ఉన్నారు.

బెంగుళూర్ రేవ్ పార్టీ

రీసెంట్ టైమ్స్ లో బెంగళూరు రేవ్ పార్టీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో రేవ్ పార్టీ గురించి వార్తలు వైరల్ గా మారాయి. ఈ రేవ్ పార్టీలో చాలామంది తెలుగు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిలో సీనియర్ నటులు శ్రీకాంత్, హేమ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అలానే కొరియోగ్రాఫర్ జానీ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఈ విషయాలు ఏవి వాస్తవాలు కాదు అంటూ స్వయంగా శ్రీకాంత్, హేమ, జానీ మాస్టర్ వీడియోలు రిలీజ్ చేసారు. అయితే వీటిలో శ్రీకాంత్, జానీ ఆ పార్టీలో ఇన్వాల్వ్ కాలేదని ఒక క్లారిటీ ఉంది. కానీ హేమా విషయంలో సరైన క్లారిటీ లేదు.

Telugu actress Hema

- Advertisement -

హేమ తప్పించుకునే ప్రయత్నం

అయితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు బయటపడగానే, నేను బెంగళూరులో లేనని హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అంటూ వీడియోలు రిలీజ్ చేసింది. ఈ వీడియో చూసిన బెంగళూరు పోలీసులు ఫైరయ్యారు. అప్పటికే అదే డ్రెస్ తో ఉన్న ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు బెంగళూరు పోలీసులు. అయితే హేమ ఆ వీడియో రిలీజ్ చేయడంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అసలైన క్లారిటీ వచ్చిందని వార్తలు కూడా వినిపించాయి. ఇకపోతే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి హేమ మరో వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ వేదిక షేర్ చేసింది. షేర్ చేసిన ఈ వీడియోలో హేమ బిర్యానీ వండుతున్నట్లు ఉంది. అయితే చాలామంది ఇది పాత వీడియో అని పసిగట్టారు. ఈ టైంలో పాత వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ తన పైన వస్తున్న వార్తల్ని కాసేపు పక్కదారి పట్టించడానికి హేమ సోషల్ మీడియా వేదిక ఎలాంటి స్టంట్లు ఇస్తుందని చాలామంది అభిప్రాయం.

కొత్త రెసిపీ లేదు హాజరు కావాల్సిందే

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ విచారణకు టాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. బ్లడ్ టెస్టులో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారికి నోటీసులు ఇస్తుంది సీసీబీ. మొదటి విడతలో 8 మందికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు ఇవ్వనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు 8 మంది విచారణకు హాజరుకానున్నారు. మొదటి విడతలో నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమ నటి కూడా ఉన్నారు. అయితే ఇదివరకు రోజుకో రెసిపీని చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసే హేమకు ఈరోజు అవకాశం లేదని ఖచ్చితంగా కోర్టుకు హాజరు అవ్వాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు