టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ ఈ రోజు ఆకస్మాతుగా మరణించారు. గత కొద్ది రోజుల అనారోగ్యంతో బాధపడుతున్న కావలి శ్యామ్ సిద్ధార్థ్ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడే కన్నుమూశారు. తండ్రి మరణంతో ఈ యంగ్ హీరో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగ నిఖిల్ తండ్రి మరణ వార్త తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగ హీరో నిఖిల్ ప్రస్తుతం.. కార్తికేయా-2, 18 పేజీస్ తో పాటు కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీ స్పై చేస్తూ.. బిజీ బిజీ గా ఉన్నాడు. ఇలాంటి సమయంలో నిఖిల్ తన తండ్రిని కోల్పోవడం బాధకరమని సినీ ప్రముఖులు అంటున్నారు.