Raasi: ‘కల్కి’పై హీరోయిన్ రాశి వివాదస్పద కామెంట్స్ !

 

Raasi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడీ సినిమా గత నెలలో జూలై 27న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, దీపిక పదుకొనే,కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నలుగురు నటీనటులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది.

ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే తాజాగా కల్కి సినిమా నిర్మాతలకు, నటీనటులకు ఓ స్వామీజీ నోటీసులు పంపించారు. హిందువుల మతపరమైన మనోభావాలను ఈ సినిమా దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబచ్చన్, ప్రభాస్ తో సహా ఈ సినిమా నిర్మాతలు, నటీనటులకు ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపించారు. ఇక 24వ రోజు అయిన శనివారం ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. గత రోజులతో పోలిస్తే విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాని ఎంతోమంది సినీ నటీనటులు కూడా చూడడం విశేషం.

- Advertisement -

Kalki Dham chairman issued legal notices on the makers of Kalki2898AD

ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి రాశి ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. కల్కి సినిమాను తన కూతురితో కలిసి చూసానని … ఈ సినిమాను నా కూతురు చాలా ఎంజాయ్ చేసిందని చెప్పుకొచ్చింది. త్రీడీ గ్లాసెస్ తో నా కూతురు ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. భైరవ పాత్రను ప్రభాస్ తప్ప ఇంకెవరు అంతా అద్భుతంగా చేసి ఉండలేరు.

ఈ సినిమాకు ఇంత సమయం ఎందుకు పడుతుంది అని ఒకప్పుడు అనుకున్నాను. ఇప్పుడు అర్థం అవుతోంది నాగ్ అశ్విన్ ఎందుకు ఈ సినిమాకు ఇంత సమయం తీసుకున్నాడు అని. క్లైమాక్స్ లో అయితే ఎవ్వరూ ఊహించలేని విధంగా ట్విస్ట్ ఇచ్చారు అని రాశి ఈ సినిమా గురించి అభినందించింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం రాశి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు