Sowmya Shetty: జల్సాల కోసం దొంగతనాలు చేసిన హీరోయిన్..!!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామందికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెలువడుతూ ఉన్నాయి.. అలా సోషల్ మీడియా ద్వారా అవకాశాలు అందుకున్న నటీనటులు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. అయితే ఇలా అవకాశాలు అందుకున్న ఒక నటి తనలోని టాలెంట్ చూపించాల్సి ఉండగా.. అలా చేయకుండా దొంగతనాలు చేసి తన టాలెంట్ ఏంటో చూపిస్తోంది.. ఏకంగా కేజీ బంగారాన్ని కొట్టేసి గోవాకు వెళ్లి మరీ అక్కడ జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. చివరికి పోలీసులకు చిక్కడంతో జైలు పాలయ్యింది ఈ అమ్మడు.. ఇంతకీ ఈ నటి ఎవరు అనుకుంటున్నారా? ఆ నటి పేరు సౌమ్య శెట్టి..

సౌమ్య శెట్టి కెరియర్..
అసలు విషయంలోకి వెళ్తే విశాఖ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ… మొదట యూట్యూబ్ ,ఇంస్టాగ్రామ్ వీడియోల ద్వారా భారీగానే పాపులారిటీ సంపాదించింది.. హాట్ ఫోటోలతో నిత్యం సోషల్ మీడియాకే హీట్ పుట్టించే ఈ ముద్దుగుమ్మ అభిమానులను భారీగానే సంపాదించుకుంది.. ఇక ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. యువర్స్ లవింగ్లీ, ద ట్రిప్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో రీల్స్ , వీడియోలను చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నది..

దొంగతనం ముందు స్కెచ్…
ఇలాంటి సమయంలోనే విశాఖ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి అయిన ప్రసాద్ కుమార్తెతో ఈమెకు బాగా పరిచయం ఏర్పడింది.. అలా ఒక షార్ట్ ఫిలిం ఆడిషన్స్ తో తమ స్నేహాన్ని మొదలుపెట్టిన ఈమె తరచూ ఆమె ఇంటికి వెళుతూ వస్తూ ఉండేదట.. ఈ చనువుతోనే ఇంట్లో ఉండే పరిసరాలన్నీ గుర్తించిన సౌమ్య తన స్నేహితురాలి ఇంట్లో ఉన్న బంగారు నగలు పైన కన్ను వేసింది.. వాటిని ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయం తీసుకున్న ఈ నటి.. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో.. అదును చూసుకొని మరీ కిలో బంగారానికి పైగా దొంగతనం చేసింది.

- Advertisement -

పోలీసుల అదుపులో నటి..
అలా కొట్టేసిన సౌమ్యశెట్టి కూల్ గా గోవాకి చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తోంది.. అయితే అనుకోకుండా ప్రసాద్ కుటుంబం వివాహ వేడుకకు వెళ్లాలని భావించగా ఆ సమయంలో నగల కోసం బీరువాను తీయగా.. అందులో నగలు కనిపించడం లేదనీ.. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారట.. దాంతో పోలీసులు ప్రసాద్ ఇంటికి వచ్చిన వారందరి వివరాలను తీసుకొని విచారిస్తూ..అనుమానితుల పైన ఆరా తీశారు.. ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని మరి విచారించగా.. హీరోయిన్ సౌమ్య శెట్టి బండారం మొత్తం బయటపడింది..

రిమాండ్ విధించింది కోర్టు..
సౌమ్య పైన తమకు అనుమానం ఉందని.. ఆ రిటైర్డ్ ఉద్యోగి చెప్పడంతో పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకుంది. దీంతో ఆమె దగ్గర ఉన్న డబ్బును మొత్తం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 15 రోజులు రిమాండ్ విధించారు.సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోలతో రీల్స్ తో షేర్ చేస్తూ .. నెటిజన్లను పిచ్చెక్కిస్తూ ఉన్న ఈ ముద్ద గుమ్మ.. ఇలాంటి పనులు చేసిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు