Gangs Of Godavari : ఒక్క స్పీచ్ తో బాలయ్య సినిమా హిస్టరీనే చెప్పేసాడు.. హైపర్ ఆది

Gangs Of Godavari : టాలీవుడ్ లో ఈ వారం భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాల్లో విశ్వక్ సేన్ నటించిన “గ్యాంగ్స్ ఆప్ గోదావరి” సినిమా కూడా ఒకటి. నేహాశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, మే 31న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ – మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా నిన్న రాత్రి (మే28) గ్రాండ్ గా జరిగింది. ఇక అంజలి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో నాజర్, సాయికుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాలో లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు విశ్వక్ సేన్.

Hyper Aadi Speech at Gangs Of Godavari Pre Release Event

బాలయ్య ముఖ్య అతిథిగా ఈవెంట్..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథి గా రావడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిన తరువాత ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇదే. ఈ ఎన్నికల్లో బాలకృష్ణ. సత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘన విజయం సాధించగా, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు. ఇదెంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందనేది జూన్ 4 తేలిపోతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ హైలెట్ గా మారింది. హీరోల లెవెల్లో లాంగ్ స్పీచ్ తో అదరగొట్టాడు. ఇక మైక్ పట్టుకుంటే హైపర్ ఆది ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో తెలిసిందేగా. ఈ ఈవెంట్ లో బాలయ్య గురించి హిస్టరీనే చెప్పి బాలయ్యని ఇంప్రెస్ చేశాడు హైపర్ ఆది.

- Advertisement -

స్పీచ్ తో ఈవెంట్ ని హోరెత్తించిన హైపర్ ఆది..

ఇక ఈ ప్రోగ్రామ్‌లో ప్రముఖ కమెడియన్, జనసేన పార్టీ నాయకుడు హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నందమూరి తారకరామారావు నుండి స్టార్ట్ చేసి నందమూరి బాలకృష్ణ హిస్టరీని ఒక్క స్పీచ్ లో చెప్పేసాడు. ఆయన సినిమాల గురించి, బసవతారకం గురించి బాగా చెప్పాడు. అలాగే ఆదిత్య 369, సమర సింహారెడ్డి, లెజెండ్, అఖండ దాకా వచ్చి, జెనరేషన్ మారినా బాలయ్య ఎనర్జీ మారదు.. అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే బాలయ్య అనవసరంగా అతి చేసే వాడ్ని కొడితే ఎంత కిక్కోస్తుందో.. మా సినిమా చూస్తే అంత కొలిక్కొస్తుందని, మాన్షన్ హౌస్ వేస్తె ఎంత కిక్కోస్తుందో మా సినిమా చూస్తే అంత కిక్కోస్తుందని, అన్నిటికీ మించి ఫైనల్ గా నందమూరి నటసింహం, కొణిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నాయని అంటూ, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా అంతే కిక్ వస్తుందని అన్నాడు. ఈ ఈవెంట్ లో బాలయ్య, విశ్వక్ సేన్ స్పీచ్ ల తర్వాత అంత హైలెట్ గా హైపర్ ఆది స్పీచ్ నిలిచిందని చెప్పొచ్చు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఓపెనింగ్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు