Nivetha Pethuraj : హీరోయిన్లకు సినిమాలకంటే ఓటిటీ లు బెస్ట్ అంటున్న నివేదా.. ఎందుకంటే?

Nivetha Pethuraj : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెన్నై నుండి వచ్చిన ఈ సుందరి “మెంటల్ మదిలో” అనే చిన్న చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించినా ఆమెకు పెద్దగా సక్సెస్ లు లభించలేదు. మధ్యలో బ్రోచేవారెవరురా, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నా పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఏడాదిన్నర గా నివేదా సినిమాల్లో నటించలేదు. ఓ తమిళ్ సినిమాలో నటించింది. తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ మంచి కంటెంట్ ఉంటే తప్ప చేయకూడదని డిసైడ్ అయ్యింది.

అయితే సినిమాల్లో కనిపించకపోయేసరికి నివేదా వేరే ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయిందనుకున్నారు అంతా. కానీ సడన్ గా పోలీసులతో వాదిస్తూ పరువు పోతుందని, వాగ్వాదానికి దిగిన వీడియో తో వైరల్ అయింది. తీరా చూస్తే… అది నివేదా పేతురాజ్ కొత్త సినిమా ప్రమోషన్ లో భాగమని తేలింది. జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్న “పరువు” అనే వెబ్ సీరీస్ ప్రమోషన్స్ కోసం ఈ వీడియో చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా నివేదా పేతురేజ్ తాజాగా సినిమాల్ని ఓటిటి లను కంపేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Interesting comments by Nivetha Pethuraj on OTTs

- Advertisement -

సినిమాల కన్నా, ఓటిటి షో లలో ఎక్కువ ఇంపార్టెన్స్..

ఇక నివేదా పేతురాజ్ నటించిన తెలుగు వెబ్ సిరీస్ ‘పరువు’ కోసం ప్రమోషనల్ స్టంట్ చేయగా, ఈ షో జూన్ 14న జీ5 లో విడుదల కానుంది. ఈ హీరోయిన్ పరువు షో కోసం ప్రచారంలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో, నివేదా పేతురేజ్ OTT షోల గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ ఇంటర్వ్యూ లో నివేదా పేతురాజ్‌ మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పాలంటే సినిమాల కంటే, ఓటీటీ ప్రాజెక్టుల్లో మహిళల పాత్రలకే ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. మీలోని ఆర్టిస్ట్‌ని సంతృప్తి పరచడానికి ఈ షోలు ఎన్నో రకాల అవకాశాలను కల్పిస్తాయి. ఆ సంతృప్తిని పరువు ద్వారానే పొందాను. ఇప్పటి వరకు నేను ఆ అనుభూతిని పొందలేదు. నేను చాలా మంచి పని చేశానని 100 శాతం సంతృప్తి చెందడం ఇదే మొదటిసారి అంటూ నివేదా చెప్పుకొచ్చింది.

పరువుతో ట్రాక్ లోకి వస్తుందా?

ఇక గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల పరువు చిత్రాన్ని నిర్మించారు. నాగబాబు, నరేష్ అగస్త్య, ప్రణీతా పట్నాయక్ కీలక పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ పరువు సిరీస్ తమిళంలో కూడా విడుదల కానుంది. ఇక “పరువు” ప్రాజెక్టు జూన్ 14న విడుదల కానున్న నేపధ్యంలో, పబ్లిసిటీ స్టంట్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాలని మేకర్స్ ప్రయత్నించారు. నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ఇలాంటివి తన సినిమాలకు ప్రమోషన్ చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఆమె డిఫరెంట్ ప్రమోషన్స్ స్ట్రాటజీ తో సినిమాలపై ఆసక్తిని పెంచింది. ఇక నివేదా తన ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, “పరువు” సీరీస్ పై మంచి హైప్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు అందుకున్న నివేదా ఇప్పుడు “పరువు” సీరీస్ తో సక్సెస్ అందుకుని ట్రాక్ లోకి వస్తుందా? ఈ సిరీస్ తో నివేదా వరుస ఛాన్సులు అందుకుంటుందా అనేది చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు