Tollywood: అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి ఆ అమ్మాయే కారణమా..?

అక్కినేని అఖిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున, అమల దంపతుల ముద్దుల కొడుకు. ఇక టాలీవుడ్ లో పెళ్లి కాని హీరోలలో అఖిల్ కూడా ఒకరు. నిజానికి ఇప్పటికే అఖిల్ ఓ ఇంటివాడు అయి ఉండాలి. అఖిల్ కి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. నాగార్జున ఈ ఎంగేజ్మెంట్ ని ఎంతో గ్రాండ్ గా చేశారు. అఖిల్ ప్రేమించిన శ్రీయ భూపాల్ తోనే ఈ ఎంగేజ్మెంట్ ని జరిపించారు. ఏమైందో ఏమో కానీ ఈ పెళ్లి రద్దయిపోయింది. శ్రియ భూపాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే కంపెనీ అధినేత మనవరాలు అన్న విషయం తెలిసిందే.

అయితే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసింది అఖిల్ కాదట. వీరి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిందట శ్రీయ. దానికి కారణాలు కూడా ఉన్నాయిట. సుబ్బిరామిరెడ్డి ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో అఖిల్ – శ్రీయ గొడవపడ్డారట. అంతేకాదు ఓసారి ఎయిర్ పోర్ట్ లో కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే అఖిల్ కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియడం వల్లనే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయనే టాక్ ఉంది.

అంతేకాకుండా అఖిల్ ఓ ఫేమస్ బ్యాట్మెంటన్ ప్లేయర్ తో సీక్రెట్ గా లవ్ ఫెయిల్ నడిపిస్తున్న సంగతి శ్రీయ కు తెలిసిపోయిందని, అందుకే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ పెళ్లి ఆగిపోయిందనే టాక్ ఉంది. ఇక ప్రస్తుతం అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు