Tollywood: ఇక శాకుంతలం పరుగు ముగిసినట్టే?

టాలీవుడ్ బ్యూటీ సమంతకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. సమంత మెయిన్ లీడ్ గా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘గుణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో స్వీయ నిర్మాణంలో శాకుంతలం సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుణ శేఖర్ రుద్రమ దేవి తర్వాత 8 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా రెండేళ్ల పాటు తెరకెక్కించాడు. దాదాపు 80 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించగా ఎన్నో అంచనాలతో ఏప్రిల్ 14 న విడుదలైన శాకుంతలం సినిమా టాలీవుడ్ లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

సమంత ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ సినిమాలో నటించింది. డైరెక్టర్ గుణశేఖర్ సమంత కాస్ట్యూమ్స్ కోసమే 14 కోట్లు ఖర్చు పెట్టాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే జనాల్లో మూవీ టేకింగ్ పై కాస్త అనుమానం మొదలైంది. అయినా ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారని టీమ్ భావించింది. కానీ గుణశేఖర్ మూవీ నిర్మాణంలో పెట్టిన దృష్టి డైరెక్షన్, స్క్రీన్ ప్లే పై పెట్టలేకపోయాడు. కేవలం 19 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగిన ఈ సినిమా మంచి టాక్ వస్తే మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు.

సినిమా మొదటి షోకే అనుకున్న రెస్పాన్స్ రాకపోవడం, ఇతర భాషల్లో థియేటర్లు దొరక్కపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఐపీఎల్ ఎఫెక్ట్ బాగా పడడం వల్ల సినిమాకి కనీస ఓపెనింగ్ కూడా దక్కలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2. 20cr మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యే సరికి 3. 65 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఉన్నంత లో ఓవర్సీస్ లోనే కొంచెం బెటర్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 15 కోట్లు కావాలి. అది జరగకపోవచ్చు. పైగా ఏప్రిల్ 21 విరూపాక్ష విడుదల అవుతుంది. కాబట్టి శాకుంతలం రన్ ఇక ఎండ్ అయినట్టే చెప్పవచ్చు. మహా అయితే ఓవరాల్ గా మరో రెండు కోట్లు రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు