Prabhas : నిరాశ పరిచిన రోజు

రెబల్ స్టార్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆదిపురుష్. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. ఇది దాదాపు 500 కోట్ల రూపాయలతో రూపొందుతుంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. త్రిడీలో అంతర్జాతీయంగా విడుదల చేస్తామని డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించాడు. అందుకు సంబంధించిన పనుల్లో ఓం రౌత్ నిమగ్నమైయ్యాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే, ఈ సినిమా టైటిల్ పోస్టర్ మినహా, ఏ ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. దీనిపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్టులు పెట్టారు.

ఇదిలా ఉండగా, ట్విట్టర్ లో ఆదిపురుష్ మరోసారి ట్రెండ్ లోకి వచ్చింది. దీనికి కారణం లేక పోలేదు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను 2021 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. ఆ సమయంలో.. ఒక ఏడాదిలో షూటింగ్ ను పూర్తి చేసి 2022 ఆగస్టు 11న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అంటే.. సరిగ్గా ఇదే రోజు అన్నట్టు. అన్ని కుదిరతే.. ఈ రోజు థియేటర్స్ లో రచ్చ రచ్చ ఉండేది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ గోల గోల చేసేవారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ, భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఒక సెన్సేషన్ మాత్రం క్రియేట్ అయ్యేది.

- Advertisement -

కానీ, పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫలితంగా సినిమా కూడా వాయిదా పడింది. ఈ రోజు మిస్ అయిన సందడి.. వచ్చే ఏడాది జనవరి 12న జరగబోతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ జాతర ఆలస్యం అవుతుంది కావచ్చు.. కానీ, డోస్ తగ్గదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు