Puri Jagannath: ఆ కెమెరామెన్ ని మోసం చేసిన పూరి జగన్నాథ్

Puri Jagannath: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనగానే సుకుమార్ త్రివిక్రమ్ రాజమౌళి పేర్లు వినిపిస్తాయి. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే వివి వినాయక్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి పేర్లు వినిపించేవి. ఈ దర్శకులు అంతా కూడా స్టార్ హీరోస్ తో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ను వసూలు కూడా చేశాయి ఈ దర్శకులు సినిమాలు. అయితే దర్శకుడు దాని కంటే కూడా వీళ్ళందరూ చాలా కష్టాలు పడుతూ వచ్చారు. ఒక్కొక్కరు రకరకాల పనులు చేస్తూ ఆ స్థాయికి వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నారు.

ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే దర్శకుడు అవ్వడానికంటే ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. చాలా దూరం పాటు కథలు చెప్పడానికి నడిచి వెళ్లడం. డబ్బుల కోసం ఏదో ఒక పని చేయటం. అలానే బొమ్మల గీయటం. గోస్ట్ డైరెక్షన్ చేయటం ఇలా చాలా పనులు చేసుకుంటూ వచ్చాడు పూరీ జగన్నాథ్. అయితే పూరి జగన్నాథ్ కి శ్యామ్ కె నాయుడు మంచి స్నేహితుడు. శ్యామ్ కె నాయుడు అన్నయ్య చోటా కె నాయుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి కెమెరామెన్ గా అప్పటికి పేరు సాధించుకున్నాడు.

PuriJagannadh

- Advertisement -

చాలా సూపర్ హిట్ సినిమాలు కు చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చేశాడు. చోటా చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చోటా కె నాయుడుకి పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే అప్పట్లో కొత్త దర్శకులకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తున్నాడు అని తెలిసి. పవన్ కళ్యాణ్ కు కథ చెప్పాలి అనుకున్నాడు పూరి జగన్నాథ్. దీనితో చోటా కె నాయుడుకి మొదట కథ చెప్పితే ఆ కథ తనకు నచ్చితేనే పవన్ కళ్యాణ్ కి కథ చెప్పడానికి అవకాశం కల్పిస్తాను అని చోటా కె నాయుడు చెప్పాడు.

అయితే పూరి జగన్నాథ్ చాలా అద్భుతంగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాను చోటా కె నాయుడుకి చెప్పాడు. కథ వెంటనే చోటా కి నచ్చి పవన్ కళ్యాణ్ కి చెప్పే అవకాశం కల్పించాడు. అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిన పూరి జగన్నాద్ బద్రి సినిమా కథ చెప్పాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడానికి పూరి ఆడిన డ్రామా బాగానే వర్కౌట్ అయింది. అయితే చోటా కి సెట్ కి వచ్చినంత వరకు కూడా పూరి తనకు చెప్పింది వేరే కదా అని తెలియదట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు