Janhvi Kapoor: ఆస్పత్రి పాలైన జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే..?

Janhvi Kapoor.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనట్లు సమాచారం. తాజాగా ఆమె తిన్న ఆహారం కల్తీ కావడంతో తీవ్ర అస్వస్థకు గురైనట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ముంబైలోని ఒక హాస్పటల్ కు తరలించగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతుందని సమాచారం. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హంఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికయింది. మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Janhvi Kapoor: Janhvi Kapoor was admitted to the hospital.. what happened?
Janhvi Kapoor: Janhvi Kapoor was admitted to the hospital.. what happened?

ఫుడ్ పాయిజన్ కు గురైన జాన్వీకపూర్..

అసలు విషయంలోకెళితే.. జూలై 12వ తేదీన అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహానికి తన ప్రియుడు శిఖర్ పహారియా తో హాజరైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత హాస్పిటల్లో చేరింది. అయితే జాన్వి ఫుడ్ పాయిజన్ కి గురైందని అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం.. ప్రస్తుతం జాన్వీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. శుక్రవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.. ఇక ఈ విషయాన్ని ఈమె తండ్రి బోనీ కపూర్ కూడా ధ్రువీకరించినట్లు సమాచారం.

జాన్వీ కపూర్ సినిమాలు..

జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉలజ్ అనే సినిమాలో ఈమె నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయగా.. సినిమా భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాలలో అవకాశాన్ని దక్కించుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమాలో నటిస్తున్న ఈమె.. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్సి 16లో ఈమె నటిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి.. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అలాగే నాని 33వ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాన్ని దక్కించుకుంది.. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ను దున్నేసే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ మరొకవైపు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన తల్లికి మించి క్రేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది జాన్వీ కపూర్.

- Advertisement -

శ్రీదేవి కెరియర్..

ఇక జాన్వీ కపూర్ తల్లి విషయానికొస్తే.. అతిలోకసుందరి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ పాపులారిటీ దక్కించుకుంది. తన అందచందాలతో యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకొని ఊహించని విధంగా నాథ్ టబ్ లో మరణించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమె లేని లోటును ఆమె కూతురు జాన్వి కపూర్ తీర్చబోతుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు