Janhvi Kapoor : బడా బాలీవుడ్ హీరోలకు షాకిచ్చిన జాన్వీ… ఆ పనికి ఈ టాలీవుడ్ హీరోనే సరైనోడు

Janhvi Kapoor : బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ ఎప్పుడూ తన పేరును ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటుంది. ఓవైపు సినిమాలు, మరోవైపు పర్సనల్ లైఫ్ కారణంగా ఈ అమ్మడు అల్మోస్ట్ అన్ని సీజన్లలో గ్యాప్ ఇవ్వకుండా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ హీరోలందరిని పక్కన పెట్టేసి ఆ పని చేయడానికి ఓ టాలీవుడ్ హీరోనే సరైనోడు అంటూ సమాధానం చెప్పడం బీటౌన్ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. మరి ఇంతకీ జాన్వి కపూర్ ఏ విషయంలో బాలీవుడ్ హీరోలను కాదని టాలీవుడ్ స్టార్ కు ప్రిఫరెన్స్ ఇచ్చిందో తెలుసుకుందాం పదండి.

బీటౌన్ హీరోల కన్నా యంగ్ టైగర్ బెస్ట్

జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఇందులో అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్‌లలో మీరు ఎవరితో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అని అడిగారు. ఆ ప్రశ్నకు జాన్వీ కపూర్ కొంత సమయం తీసుకొని బాగా ఆలోచించి మరీ సమాధానం ఇచ్చింది. అయితే జాన్వీ కపూర్ సమాధానం విన్న బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు. ఆ ప్రశ్నకు జాన్వీ రిప్లై ఇస్తూ “నేను కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌తో దేవరా పార్ట్ వన్ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నాను. రెండవ పాట షూటింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అంతేకాదు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్‌ కి వీరాభిమాని’ అంటూ ఎగ్జైటింగ్ గా చెప్పింది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెకు అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్‌లతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఆసక్తి లేదన్న మాట. ఇలా ఆమె బీ టౌన్ బడా హీరోలు అందరినీ వదిలేసి ఏకంగా యంగ్ టైగర్ తో డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపడం విశేషం. కాగా జాన్వి కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27 న దేవర థియేటర్లలోకి రానుంది.

Button of Jhanvi Kapoor shirt was opened in front of everyone, the b*ra of  the actress was clearly visible in the camera - informalnewz

- Advertisement -

అంబానీ పెళ్లి తరువాత అనారోగ్యం

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానుల కోసం ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న జాన్వీ గత కొన్ని సంవత్సరాలుగా శిఖర్ పహాడియాతో డేటింగ్ చేస్తోంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు. ఇక ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో జాన్వి కనిపించింది. పెళ్ళిలో శిఖర్ పహాడియాతో కలిసి ఆమె డ్యాన్స్ చేసిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఈ బ్యూటీ ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలైంది. అనారోగ్యం నుంచి ఇలా కోలుకుందో లేదో అలా తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్లు స్టార్ట్  చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు