Jhanvi Kapoor: ఏకంగా బాయ్ ఫ్రెండ్ పేరుతో డైమండ్ నెక్లెస్… జాన్వీ ఇన్ డైరెక్ట్ హింట్

Jhanvi Kapoor : బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ డేటింగ్ లో ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాయ్ ఫ్రెండ్ పేరుతో ఉన్న డైమండ్ నెక్లెస్ వేసుకుని మరోసారి అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ బీటౌన్ చిన్నది. మరి ఇంతకీ ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ లో దాగున్న సీక్రెట్ ఏంటి? అంటే…

షికు అనే అక్షరాలతో డైమండ్ నెక్లెస్…

జాన్వి కపూర్ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ మైదాన్ అనే మూవీని నిర్మించారు. అజయ్ దేవగన్, ప్రియమణి జంటగా నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ ను తాజాగా నిర్వహించగా, అందులో జాన్వి కపూర్ కూడా మెరిసింది. వైట్ ప్యాంట్ సూట్ వేసుకుని ప్రెస్ మీట్ కు హాజరైంది జాన్వి కపూర్. ఈ ఈవెంట్లో జాన్వి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా, అందరి కళ్ళు ఆమె డైమండ్ నెక్లెస్ మీదే పడ్డాయి. దానిపై షికు అనే పేరు ఉండడమే దానికి కారణం. దీంతో ఒక్కసారిగా జాన్వి కపూర్ ఆ నెక్లెస్ ధరించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజులుగా ఈ బాలీవుడ్ బ్యూటీ మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

నోరు జారిన జాన్వీ…

ఒకానొక సందర్భంలో జాహ్నవి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ గురించి నోరు జారింది. కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాంలో జాన్వి బాయ్ ఫ్రెండ్ పేరు రివీల్ అయ్యింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ప్రొడ్యూసర్ కరణ్ జాన్వి స్పీడ్ డైల్ లిస్టులో ఎవరెవరు ఉంటారు? అని ప్రశ్నించగా, జాన్వీ తన తండ్రి, చెల్లి పేరు, శిఖర్ పేరు చెప్పింది. అయితే వెంటనే చెప్పాల్సిన దానికన్నా ఎక్కువే చెప్పానని అర్థం చేసుకోండి అంటూ మేటర్ డైవర్ట్ చేసింది. అప్పటి నుంచి జాన్వి, శిఖర్ ప్రేమలో మునిగితేలుతున్నారని ఫిక్స్ అయిపోయారు సినీ జనాలు. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే జాన్వి, శిఖర్ ఇద్దరూ కలిసి తరచుగా కెమెరాల కంటికి చిక్కుతున్నారు.

- Advertisement -

శిఖర్, జాన్వి ప్రేమాయణం గురించి బోనీ కపూర్ ఏమంటాడంటే…

శిఖర్ తనకు బాగా నచ్చుతాడని చెప్పుకొచ్చారు బోనికపూర్. అతడితో స్నేహం బాగుంటుందని, తన కోసం, జాన్వి, అర్జున్ ల కోసం అతను ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అలాంటి వ్యక్తి తమ కుటుంబంలో ఉండడం అదృష్టం అంటూ శిఖర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు బోని. మొత్తానికి తండ్రి కూతుర్లు కలిసి శిఖర్ ను అప్పుడే తమ కుటుంబంలోని వ్యక్తిగా ప్రకటించారు. ప్రస్తుతం జాన్వి కపూర్ దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బోనీ నిర్మించిన మైదాన్ మూవీ రంజాన్ కానుకగా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు