Tollywood : తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇదే!

Tollywood : టాలీవుడ్ లో బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రతి స్టార్ హీరో సినిమాకు వంద కోట్ల రేంజ్ లో బిజినెస్ అవుతుంది. పైగా చిన్న హీరోల సినిమాలకు సైతం వంద కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇక పాన్ ఇండియా చిత్రాలు ఐదు ఆరు వందల కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుంటూ ఇండియా వైడ్ గా తెలుగు ఇండస్ట్రీ హీరోలు సత్తా చాటుతున్నారు. RRR ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత తెలుగులో వందల కోట్ల బిజినెస్ లు, కలెక్షన్స్ కామన్ అయిపోయాయి. కానీ ఒకప్పుడు 30 కోట్లు 40 కోట్ల కలెక్షన్లే గొప్ప అనుకుంటున్న సమయంలో మగధీర తర్వాత తెలుగు సినిమా స్థాయి 80 కోట్ల క్లబ్ లో చేరగా తర్వాత బాహుబలి రాకతో 100 కోట్ల పైకి చేరుకుంది. కానీ టాలీవుడ్ హిస్టరీలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఈ లెక్కలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా, తెలుగులో తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమా ఏది అన్న ఆసక్తికరమైన చర్చ కొన్ని రోజులుగా జరుగుతుంది. పోకిరి అని కొందరు, అంజి అని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. కానీ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇండస్ట్రీలో 25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దే కావడం విశేషం.

Johnny is the first movie in Tollywood that did 25 crores pre-release business

ఇండస్ట్రీలో 25 కోట్ల బిజినెస్ చేసిన మొట్టమొదటి సినిమా ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “జానీ” తెలుగు లో తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అని అంటున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాలా 24 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా. అయితే 7వ సినిమా ఖుషీ తో సంచలన విజయం అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తర్వాత సినిమా అవ్వడం తో జానీ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వం దహించిన సినిమా కావడం విశేషం. దాంతో ఈ సినిమా బిజినెస్ 25.6 కోట్లకి అటూ ఇటూ గా జరిగిందని అంచనా. కాగా సింహాద్రి సినిమా తర్వాత రావడంతో ఆంధ్రావాలా పై కూడా అంచనాలు ఓ రేంజ్ లో ఉండటంతో ఆ సినిమాకి 24 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. కానీ ఇటు జానీ కానీ, అటు ఆంధ్రావాలా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా టాలీవుడ్ లో 2003 టైం లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకున్న సినిమా గా జానీ నిలవగా తర్వాత చిరంజీవి ఠాగూర్ సినిమాకి 23.50 కోట్ల బిజినెస్ చేసిందట. మొత్తం మీద జానీ టాలీవుడ్ లో ఫస్ట్ 25 కోట్ల బిజినెస్ సాధించిన సినిమా గా నిలిచింది.

- Advertisement -

జానీ తర్వాత అంజి యే..

ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జానీ సినిమా తర్వాత, మళ్ళీ చిరంజీవి నటించిన అంజి సినిమాకి 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. చిరంజీవి సినిమా పైగా, సోషియో ఫాంటసీ సినిమా కావడం వల్ల కాస్త ఓపెనింగ్స్ తెచ్చుకొని స్వల్ప నష్టాలతో బయటపడింది. ఇక ఆ తర్వాత చాలా రోజులకు 25 కోట్ల బిజినెస్ బడా సినిమాల నష్ఠాల వల్ల జరగలేదట. ఇప్పుడు టాలీవుడ్ (Tollywood) లో 100 కోట్ల బిజినెస్ లు చాలా కామన్ అయిపోయాయి. రీసెంట్ గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ 200 కోట్ల నుండి 300 కోట్ల రేంజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తూ దూసుకు పోతున్నాయి. ఫ్యూచర్ లో కూడా మన హీరోల పాన్ ఇండియా మూవీస్ బిజినెస్ రేంజ్ లో మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు