Jr NTR : ఉన్నఫలంగా దేవాలయాల చుట్టూ ఎన్టీఆర్‌ ఎందుకు తిరుగుతున్నాడు ?

 

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR) ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్నారు. కుటుంబంతో కలిసి మంగళూరు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో ( Jr NTR) పాటు అతడి వెంట కాంతార ఫేమ్ నటుడు రిషబ్ శెట్టి…. (Rishabh shetty) సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. శనివారం సాయంత్రం తన తల్లి కోరిక మేరకు ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠం దర్శించుకున్న ఎన్టీఆర్ ఆదివారం కొల్లూరులోని ముఖాంబిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాడు.

ఇక ఉదయం పంచకట్టులో ఆలయానికి వెళ్ళిన తారక్ ( Jr NTR) అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. తారక్ తో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా ముఖాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అలా ఎన్టీఆర్ ( Jr NTR) ఉన్నఫలంగా దేవాలయాలను సందర్శించడానికి కారణం…. తాను నటించిన దేవర సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ అతని తల్లి పట్టుబట్టి అక్కడికి తీసుకు వెళ్లిందని అంటున్నారు.

- Advertisement -


దేవర ఇప్పుడు ఎన్టీఆర్ కు అతిపెద్ద పాన్ ఇండియా చిత్రం. ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్ కు ఓరకంగా పాన్ ఇండియా ఎంట్రీకి టెస్ట్ లాంటిది. అలాగే దేవాలయ సందర్శనతో ఒక్కసారిగా మీడియాలో ఎన్టీఆర్ పైన, దేవరాపైన ఏటెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ మాత్రమే దేవర సినిమాకు సోలో ఫేస్ అనేది మాత్రం నిజం. అయితే… ఉన్నఫలంగా దేవాలయాల చుట్టూ ఎన్టీఆర్‌ ఎందుకు తిరుగుతున్నాడు ? అనే ప్రశ్నపైన బాలయ్య ఫ్యాన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. బాలయ్య వేడుకును ఎస్కేప్‌ చేసేందుకు ఇలా ఉడిపికి ఎన్టీఆర్‌ వెళ్లినట్లు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు