Jr NTR and Kalyan Ram on TDP : తెలుగుదేశం పార్టీలో నందమూరి హరికృష్ణ ఒక కీలక పాత్రను పోషించారు. తన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు సపోర్ట్ అందించారు. వారికి నారా ఫ్యామిలీతో ఎప్పటినుంచో కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయని విషయం తెలిసిందే. అయితే 2009లో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ముందుకు వచ్చి ప్రచారం చేశాడు. అప్పటి ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ కీలకపాత్రను పోషించాడు. ఆ తర్వాత తనకు తానుగా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించలేదు. 2014లో కూడా సైలెంట్ గానే ఉన్నాడు తారక్.
ఇకపోతే ఎన్టీఆర్ను కళ్యాణ్ రామ్ ను నారా ఫ్యామిలీ ఎప్పటినుంచి దూరం పెడుతూ వస్తుంది. ఇకపోతే నారా లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకపాత్రను పోషిస్తున్నారు. అయితే ఇది చాలామందికి నచ్చడం లేదు. తెలుగుదేశం పార్టీకి అసలైన వారసులు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అంటూ చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలలో పాల్గొనలేదు. చాలామంది సపోర్టుగా మాట్లాడినా కూడా వీరు మాత్రం స్పందించలేదు.
ఇకపోతే రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దీనిపై మొదటిసారి స్పందించాడు ఎన్టీఆర్. ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అంటూ ట్విట్ చేశారు ఎన్టీఆర్. అయితే దీనిపై చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. పార్టీ సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం మావయ్య అత్తయ్య అంటూ ట్వీట్ చేశాడంటూ కొంతమంది కళ్యాణ్ రామ్ ను, ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024
ఇకపోతే ఇద్దరు అన్నదమ్ముల నుంచి ఒకే రకమైన ట్వీట్ రావడంతో చాలా అనుమానాలకు దారితీస్తుంది. విజయం సాధించిన ఇంతసేపటి వరకు విషెస్ చెప్పకపోవడం. ఇద్దరూ కలిసి అనుకుని చెప్పారా అంటూ కొంతమంది ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ పార్టీ విజయం సాధించినా కూడా ఏదో ఒక రోజు ఈ పార్టీ పగ్గాలను వీళ్లే తీసుకొని నడిపిస్తారని చాలామందికి గట్టి నమ్మకం.
చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన @ncbn మావయ్యకీ, @JaiTDP నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!
మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం…
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024