Kaantha: డిజాస్టర్ బ్యూటీ కి పాన్ ఇండియా సినిమా అవకాశం

Kaantha: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో లో కృతి శెట్టి ఒకరు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆ సినిమాలు కృతి శెట్టి బేబమ్మ అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత కృతి శెట్టికి చాలా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. హీరో వైష్ణవ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నాని సరసన నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే రామ్ పోతినేని వారియర్ అనే సినిమాలో నటించింది కృతి ఈ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మొదటి సినిమా హిట్ అయినా కూడా తర్వాత వచ్చిన సినిమాలు ఏమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా మనమే అనే సినిమాతో మరోసారి ప్రాక్షకులను పలకరించింది కృతి శెట్టి.

Krithi Shetty

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టికి ఒక పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఇక ప్రస్తుతం దుల్కర్ లక్కీ భాస్కర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కాంత అని ఒక పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు దుల్కర్. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు