Kalki2898AD : చరణ్ కూతురు క్లింకారకి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్స్ …

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా జూన్ 27న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. నిజానికి ఇండియా మొత్తంలో సినీ అభిమానుల కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయ్. రెండున్నరేళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఒక సైన్స్ ఫిక్షన్ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. నిజానికి సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా టెక్నికల్ వర్క్ పెండింగ్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా షూటింగ్ మొత్తం ముగించుకుని రిలీజ్ కి రెడీ కాబోతుండగా, ఈ సినిమా ప్రమోషన్లు ఆల్రెడీ మొదలు పెట్టేసారు మేకర్స్. ఆ మధ్య బుజ్జి అనే పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రభాస్ స్టేటస్ పెడితే ఎంత పెద్ద వైరల్ అయిందో తెలిసిందే. అక్కడినుండే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పుడు దాన్ని పీక్స్ కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురుకి ఓ స్పెషల్ గిఫ్ట్ ని పంపారు కల్కి మేకర్స్.

Kalki2898AD team sends special gift to Ram Charan's daughter Klinkara

చరణ్ కూతురుకి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్స్..

ఇక తాజాగా ఈ సినిమాలోని బుజ్జి, భైరవ క్యారెక్టర్స్‌ తో మేకర్స్ ‘కల్కి’ (Kalki2898AD) మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. అలాగే, వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తూ సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా, తాజాగా రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు అందాయి. ఇక ఈ స్పెషల్ గిఫ్ట్స్ కి “థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్” అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. అలాగే చిత్ర నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్న దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ ని ట్యాగ్ చేస్తూ విషెస్ అందచేశారు ఉపాసన.

- Advertisement -

ప్రమోషన్లలో సరికొత్త ప్లానింగ్స్…

ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా స్టైలిష్ గా తెరకెక్కించగా, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని త్వరలోనే జూన్ 7న ముంబై లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇప్పటి నుండే ఇండియా వైడ్ గా అన్ని సిటీ ఏరియాల్లో టూర్లు వేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏకంగా 22 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు