Kangana Ranaut: రూ.40 కోట్లు పరువు నష్టం దావా.. ఏం జరిగిందంటే..?

Kangana Ranaut.. టాలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఘాటైన విమర్శలు, ప్రకటనలతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. బిజెపి ఎంపీగా గెలిచింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇలాంటి సమయంలోనే ప్రతిపక్ష నేతగా పేరుపొందిన రాహుల్ గాంధీని విమర్శించడం తోపాటు ఒక ఫోటోను కూడా షేర్ చేసింది కంగనా రనౌత్. ఇదే ఈమె పాలిట శాపంగా మారింది. దీంతో ఏకంగా రూ.40 కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.

Kangana Ranaut: Rs 40 crore defamation suit.. What happened..?
Kangana Ranaut: Rs 40 crore defamation suit.. What happened..?

రాహుల్ గాంధీ పై అలాంటి పోస్ట్..

రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సరిత కుల గణన పైన ఉపన్యశిస్తూ ఉన్నారట .అందుకు కౌంటర్ గా ఎడిట్ చేసిన ఒక ఫోటోని సైతం షేర్ చేస్తూ.. ముస్లిం క్యాప్, క్రిస్టియన్ సిలువు, హిందూ తిలకం ఉండేటువంటి ఒక ఫోటోను సైతం ఎడిట్ చేసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా క్షణాలలో ఈ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు కంగనా రనౌత్ పై ఫైర్ అవుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఈ నటి పైన సుప్రీంకోర్టు న్యాయవాది నరేంద్ర మిశ్రా పరువు నష్ట దావా కూడా వేయడం జరిగిందట.

రాహుల్ గాంధీని బహిరంగంగా అవమానించిన కంగనా..

ఏదైనా టెక్నాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఫోటోను ట్యాంపరింగ్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడం చాలా నేరమని, ఇది రాహుల్ గాంధీ నీ బహిరంగంగా అవమానించినట్లే అవుతుంది అంటూ సుప్రీంకోర్టు న్యాయవాది మిశ్రా తెలియజేశారు.. హిమాచల్ ప్రదేశ్ లో ఉండేటువంటి మండి ప్రాంతం నుంచి లోకసభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ పోటీ చేసి ఎంపీగా గెలిచింది. అయితే ఈమె గెలిచినప్పటి నుంచి కూడా ఎన్నో వివాదాలు ఈమెను చుట్టు ముడుతూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయాలు , మరొకవైపు సినిమాలతో కంగనా తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

- Advertisement -

కంగనా రనౌత్ సినిమాలు..

కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే , స్వయంగా ఆమె దర్శకత్వం , నిర్మిస్తున్న నటించిన చిత్రం ఎమర్జెన్సీ. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రాన్ని ఇందిరా గాంధీ విధించినటువంటి ఒక ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.. మరి ఈసారైనా సరైన సమయానికి విడుదల చేస్తుందేమో చూడాలి.. ముఖ్యంగా ఈ సినిమా కోసం తన ఆస్తులను కూడా అమ్మినట్లు తెలుస్తోంది కంగనా రనౌత్. ఇక అంతేకాదు ఇటీవల ముంబైలో పాలిహిల్ లో వున్న 40 కోట్ల ఖరీదైన బంగ్లాని కూడా ఈమె అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కంగనా రణౌత్ చేసిన పని ఆమె మెడకు ఉచ్చులా బిగుస్తోందని చెప్ప వచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు