బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అవుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసి విజయాన్ని అందుకుంది.
దీంతో కంగనా రనౌత్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు చాలా సంతోషంలో ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కంగనా దేవాలయాలకు వెళ్తూ పలు పూజలు, హోమాలు వంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. అలాగే ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆలయాల్లో ప్రత్యేకంగా మొక్కలు తీర్చుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ సద్గురు ఆశీర్వాదాలు తీసుకుంది.
కంగనా రనౌత్ సద్గురును కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో కంగనా పింక్ కలర్ చీర కట్టుకొని సాంప్రదాయంగా కనిపించారు. సద్గురు కుర్చీలో కూర్చుని ఉండగా ఆమె కింద కూర్చొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈషా సెంటర్లోని శివుని విగ్రహం దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలను కూడా షేర్ చేస్తూ “ఈశా సెంటర్ హ్యాపీ ప్లేస్” అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.