Kangan Ranaut: సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?

Kangana Ranaut.. బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్యకాలంలో రాజకీయాలలో కూడా అడుగుపెట్టి, సక్సెస్ అయ్యారు. స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించారు. అలాగే కాంట్రవర్సీలలో కూడా కంగనా పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలే ఎన్నికల్లో విజయం సాధించిన ఈమె ఎంపీ గా కూడా పదవీ బాధ్యత చేపట్టారు. ఇక ఇప్పుడు కంగనా హీరోయిన్ గా నటిస్తున్న ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఎమర్జెన్సీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. తాజాగా కొన్ని గంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగా, 2:53 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది.

Kangana Ranaut: Will you say goodbye to movies?
Kangana Ranaut: Will you say goodbye to movies?

కంగనా నటించిన ఎమర్జెన్సీ ట్రైలర్ రిలీజ్..

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా అద్భుతంగా మెప్పించింది. ఈ సినిమాలో కంగన రనౌత్(Kangan Ranaut) ఎమర్జెన్సీ సమయంలో చూపించనున్నారు. ముఖ్యంగా ఇలాంటివి ఎన్నో ఈ ట్రైలర్ లో కనిపించి అబ్బురపరిచాయి. సినిమా చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. అంతే కాదు ఈ సినిమా కంగన కు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ చిత్రానికి ముందు కంగనా నటించిన తేజస్ చిత్రం 2023లో విడుదలైంది అయితే దారుణంగా ఫ్లాప్ అయింది. అంతకు ముందు 2022లో వచ్చిన ధడక్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అలాగే జడ్జి మెంటల్ హై క్యా , పంగ, తలైవి వంటి సినిమాలు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి.

సినిమాలకు దూరం కానున్న కంగనా..

అందుకే ఈ సినిమా కంగనా రనౌథ్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది. మరొకవైపు బిజెపి టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేసిన ఈమె.. మండి లోక సభ స్థానం నుంచి గెలుపొందింది. ఇప్పుడు ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించనుంది. సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన పనులకు కూడా ఫుల్ సమయాన్ని కేటాయిస్తోంది .ఇలాంటి పరిస్థితుల్లో ఈమె సినిమాలను వదిలేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో కూడా ఇదే విషయాన్ని ఈమె తోసిపుచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసాను.. నేను రాజకీయాల్లో మరింత విజయం సాధించాలని భావిస్తే అక్కడ నాకు మరింత సమయం అవసరం ఉంది. నా జీవితాన్ని నాకోసం నిర్ణయించుకుంటాను. కానీ నాకు ఎలాంటి ఆలోచనలు లేవు.. అవసరమైన చోట ఏది అవసరమైన సరే నేనే నిర్ణయించుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది కంగనా. ప్రస్తుతం కంగనా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈమెకు సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారగా.. రాజకీయంలో సక్సెస్ అవ్వడానికి అక్కడికే వెళ్తుందా లేక ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది కాబట్టి మరి ఇటువైపే ఉంటుందా లేక రెండు పడవల మీద ప్రయాణం కంగనాకు ఎలా కలిసి వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు