Karan Johar : ఇప్పుడు టాలీవుడ్..

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒక నిర్మాతగా, హోస్ట్ గా ఆయనకు రీమార్క్ లేదు. బాలీవుడ్ లో ప్రముఖ హీరోల సినిమాలు అన్నిటిని కరణ్ నిర్మిస్తుంటారు. ఈయన నిర్మాణంలో అనేక హిట్ సినిమాలు వెండితెరపై అలరించాయి. అలాగే బాలీవుడ్ స్టార్ల కుమారులను, కుమార్తేలను బాలీవుడ్ కు పరిచయం చేస్తారనే టాక్ కూడా ఉంది.

అయితే ఇప్పుడు ఈ బడా నిర్మాత బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు ఉన్నాడు. టాలీవుడ్ లో అగ్ర హీరో కొడుకును బాలీవుడ్ లాంచ్ చేయడానికి కరణ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అక్కినేని వరసుడిగా టాలీవుడ్ లోకి వచ్చిన అఖిల్ ను కరణ్ జోహర్ బాలీవుడ్ లో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నాడట. అందు కోసం ఇప్పటికే ప్లాన్స్ జరుగుతున్నట్లు హిందీ మీడియాలో గాసిప్ ఉంది. టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచిలర్ కుర్రాలలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా.. టాలీవుడ్ లో రొమాంటిక్ హీరో ఇమేజ్ మాత్రం సాధించాడు.

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మాదిరిగా అఖిల్ కి కూడా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. అయితే అఖిల్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ సినిమాా చేయబోతున్నారని, అందులో శ్రీదేవి తనయ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీసులో నాగార్జున కనిపించారు. దీంతో ఇప్పుడు తన కొడుకు అఖిల్ హిందీ అరంగేట్రం విషయంలో నాగ్ ముంబైలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు