Kareena Kapoor : పుకార్లుకు బ్రేక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి సినిమా తరువాత  ప్రభాస్ ప్రభాస్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారారు.  ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.  తన రాబోయే సినిమాలపై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లున్నాయి. 

ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలతో ఫుల్ బీజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగాతో  ఒక ఆసక్తికరమై చిత్రానికి సైన్ చేశాడు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా రానుంది. ఈ చిత్రంలో  కరీనా కపూర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె మాత్రం అన్ని పుకార్లకు బ్రేక్ వేసింది. తనను చిత్ర యూనిట్ సంప్రదించలేదని తెల్చి చెప్పింది. స్పిరిట్ లో తాను హీరోయిన్ గా నటించడం లేదని, తనను టీమ్ సంప్రదించడం లేదని స్పష్టం చేసింది.

కరీనా కపూర్ వాస్తవాన్ని చెప్పడంతో మేకర్స్ ఇంకా ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపికలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో రణ్ బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు