Kasturi Shankar.. తాజాగా ప్రముఖ నటుడు దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కట్టుకున్న భార్యను కాదని ప్రియురాలిని పెళ్లి చేసుకున్న దర్శన్ తన ప్రియురాలిని రేణుకా స్వామి అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిసి.. తన అభిమానులను ఉపయోగించుకొని అతడిని హత్య చేయించాడు. ఇక హత్య చేసిన వ్యక్తులను ఆరా తీయగా దర్శన్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది.
దర్శన్ కు అండగా కస్తూరి..
కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. దర్శన్ తన జీవితంలో ఏదైనా సమస్యల్లో ఉంటే ఆయన భార్య చూసుకుంటుంది.. కానీ పోలీసులు, కోర్టు అంటూ చాలా ఉన్నాయి.. అదంతా అతని పర్సనల్ లైఫ్.. కానీ కొందరు సెలబ్రిటీకి మెసేజ్లు చేసి వేధించే హక్కు పబ్లిక్ కి లేదు.. దర్శన్ విషయంలో అది కాస్త చాలా దూరం వెళ్ళింది.. ఇక అతనికి చాలా కోపం.. పైగా దర్శన్ రేణుకా స్వామిని కొట్టి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో.. కానీ పరిస్థితి కాస్త చేజారిపోయి రేణుకా స్వామి మరణించాడు.. హింసను ఎప్పుడు ప్రోత్సహించకూడదు.. కానీ చనిపోయిన వ్యక్తి కూడా మంచివాడు కాదు..అతను పవిత్రను వేధించాడు.. అసలు అతనికి ఏంటి సంబంధం? ఎందుకు అలాంటి మెసేజ్లు పెట్టాలి? పవిత్రతో దర్శన్ రిలేషన్షిప్ లో ఉండడం తప్పే కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే దాని గురించి చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు..
ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టే ఇలా చేస్తున్నారు..
ఏ పొలిటీషియనో .. ఏ బిజినెస్ మ్యానో ఇలా చేస్తే అతను ఎవరో కూడా తెలియకుండా మాయం చేస్తారు.. కానీ అదే ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తే మాత్రం ఇలా ఇబ్బంది పెడతారు.. ఇదేం న్యాయం అంటూ ఆమె ప్రశ్నించింది.. అలానే మనుషుల్ని కొట్టాలని, చంపాలని అనడం కాదు.. కానీ ఎవరికైనా ఏదో ఒక పాయింట్ లో సహనం కచ్చితంగా కోల్పోతారు. అయితే ప్రస్తుతం ఎవరింట్లో అయినా ఏదైనా సమస్య కచ్చితంగా ఉంటుంది.. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా ఒక వ్యక్తి రిలేషన్ లో ఉండడం అనేది తప్పే కాదు.. తప్పు అనే హక్కు కూడా ఎవరికీ లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజెన్లు కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు.. ఒక వ్యక్తిని హత్య చేసిన దర్శన్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… మరి దీనిపై కస్తూరి మరేదైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇకపోతే ఇటీవలే రమ్య దివ్య స్పందన.. దర్శన్ చేసింది తప్పు అంటూ కామెంట్లు చేయగా ఇప్పుడు కస్తూరి మాత్రం దర్శన్ చేసింది తప్పే అయినా హత్యకు గురైన వ్యక్తి కూడా తప్పు చేశాడు అంటూ కామెంట్లు చేస్తోంది. మొత్తానికైతే ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మరి ఇవి ఎంత వరకు వెళ్తాయో చూడాలి.