Khushboo: గాయాల పాలైన ఖుష్బూ.. అసలేం జరిగిందంటే..?

Khushboo.. ఖుష్బూ (Khushboo).. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన అందంతో నటనతో తెలుగు , తమిళ్, కన్నడ భాషలో వందలాది సినిమాలలో హీరోయిన్గా చేసి మెప్పించిన ఈమె, ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే ఈమె అందానికి , నటనకు మంత్రముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టి ఆరాధిస్తున్నారు.అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అందాల తార , ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో స్పెషల్ రోల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా తన అభిరుచిని కూడా చాటుకుంటున్నారు.

Khushboo: Injured Khushboo.. What actually happened..?
Khushboo: Injured Khushboo.. What actually happened..?

గాయాల పాలైన ఖుష్బూ..

ఈ క్రమంలోనే తన భర్త సుందర్ (Sundar C)నటించి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి , ఏకంగా రూ.100 కోట్లు సొంతం చేసుకున్నారు. మరొకవైపు పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నారు ఖుష్బూ. ఇకపోతే తాజాగా ఈమె గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టులో ఆమె కాలికి కట్టుతో కనిపించింది .దీంతో అసలేం జరిగింది..? ఈ గాయానికి కారణాలేంటి..? ప్రమాదం ఎలా జరిగింది..? అనే విషయాలు వెల్లడించలేదు. అయితే అభిమానులు మాత్రం ఖుష్బూ ను అలా చూసే సరికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్స్ కామెంట్స్..

ప్రస్తుతం ఖుష్బూ సుందర్ చేసిన ఈ పోస్టు సోషల్ మాధ్యమాలలో చాలా వైరల్ గా మారుతుంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్ లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇకపోతే తమిళనాడు రాజకీయాలలో బిజెపిలో కీలక పాత్ర వ్యవహరిస్తున్న ఈమె అటు ప్రజలలో కూడా మంచి మన్ననలు పొందారు.

- Advertisement -

ఖుష్బూ సుందర్ తెలుగు ఎంట్రీ..

ఖుష్బూ సుందర్ విషయానికి వస్తే .. కలియుగ పాండవులు చిత్రంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు హీరోయిన్గా అడుగు పెట్టింది కూడా ఈ చిత్రంతోనే.. వెంకటేష్ హీరోగా తొలి పరిచయంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పేకాట పాపారావు చిత్రంలో కూడా నటించింది. ఇక 2018లో అజ్ఞాతవాసి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె, హీరోకి తల్లి క్యారెక్టర్ లో నటించింది. అంతేకాదు స్టాలిన్ వంటి చిత్రాలలో చిరంజీవికి అక్కగా కూడా నటించింది.

ఖుష్బూ రాజకీయ జీవితం..

ఇక ఖుష్బూ రాజకీయ విషయానికి వస్తే.. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె దర్శకుడు , హీరో సుందర్ సి తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. ఇక తర్వాత రాజకీయంగా ఎదిగిన ఈమె అక్కడ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతోంది. ఒకప్పుడు కాంగ్రెస్లో చేరిన ఈమె.. ఇప్పుడు బీజేపీ అంటూ తన మార్క్ చూపిస్తోంది. తమిళ రాజకీయాలలో తన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్ కూడా సరైన సమాధానం ఇస్తూ ఉంటుంది ఖుష్బూ. ఇకపోతే హిందూ, ముస్లిం అంటూ తన ఫ్యామిలీ మీద ఎప్పుడు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే సమాజంలో జరిగే సంఘటనలు , అత్యాచారాలు, మహిళలపై జరిగే అన్యాయాలపై కూడా ఎప్పుడు తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కాలికి బ్యాండేజ్ తో కనిపించడంతో అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంట్లోనే ఉండండి , రెస్ట్ తీసుకోండి అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు