Kiara Advani : ఆ సినిమా వల్లే హీరోయిన్ అయ్యా..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో కియారా తన నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా నటించిన “గోవింద నామ్ మేరా” చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు డైరెక్ట్ శశాంక్ కైతాన్ తో పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది. తాను ఎప్పుడూ ఒక నటిగా దర్శకుడుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇక తాను యాక్టింగ్ ని కెరియర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తన తల్లిదండ్రులు తన భద్రత గురించి ఆందోళన చెందారని చెప్పుకొచ్చింది కియారా.

అయితే తాను స్కూల్లో చదువుతున్నప్పుడు ఓసారి తన తండ్రితో కలిసి “3 ఇడియట్స్” సినిమా చూడడానికి వెళ్లానని.. ఆ సినిమా తన తండ్రిని ప్రభావితం చేసిందని చెప్పింది. ఆ సినిమా చూసిన తరువాతే సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకున్నారని చెప్పింది కియారా అద్వానీ. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది కియారా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు