Koratala Shiva: నష్టాలను పూడుస్తున్న దర్శకుడు

మిర్చి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. వరుస హిట్స్ అందుకుని స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ఆచార్య సినిమా మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎన్నో అంచనాలతో సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో నిరాశపరిచింది. ఆచార్య సినిమాను తీసుకున్న డిస్ట్బ్యూటర్స్ తీవ్ర నష్టాలను చవిచూశారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ స్వయంగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల పట్ల సానుకూలంగా స్పందించకపోవడంతో ఇప్పుడు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత దర్శకుడిపై ఉంది.

కొరటాల ఆచార్య డిస్ట్రిబ్యూటర్‌లకు తన సొంత డబ్బు చెల్లించడమే కాకుండా, తన రాబోయే చిత్రాన్ని పంపిణీ చేసే అవకాశాన్ని కూడా వారికి ఇస్తున్నాడు.శివ తన కెరీర్‌లో ఆచార్య రూపంలో తన మొదటి ఫ్లాప్‌ను రుచి చూశాడు.ప్రస్తుతం శివ తదుపరి చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు