Krishna Vamsi: రామ్ చరణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ

Krishna Vamsi: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ అంటే వివి వినాయక్, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వీళ్ళ పేర్లు వినిపించేవి. ప్రస్తుతం అందరూ కొత్త తరం దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేశారు. ఆ కొత్త తరం దర్శకులు అంతా కూడా స్టార్ హీరోస్ యంగ్ హీరోస్ తో ప్రాజెక్ట్స్ పట్టుకొని సినిమాలు చేస్తున్నారు. ఈ టైంలో సీనియర్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది. ఇకపోతే ఆ సీనియర్ డైరెక్టర్లు కూడా ఒకప్పుడు ఈ స్టార్ హీరోలతో పని చేసిన వాళ్లే. అందులో కృష్ణవంశీ మహేష్ బాబు, ఎన్టీఆర్,రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలతో ఇదివరకే సినిమాలు చేశాడు.

ఇప్పుడు ఈ నలుగురు హీరోలు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఇంకా కృష్ణవంశీ విషయానికి వస్తే కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమయ్యే కథలను చేస్తున్నారు. ఇక ఈ తరుణంలో కృష్ణవంశీతో ఆ హీరోలు పనిచేయడం అనేది అసాధ్యమైన పని అని చెప్పాలి. ఈ విషయాన్ని కృష్ణవంశీ కూడా ఒప్పుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ తేజ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే అనే సినిమాను చేశాడు కృష్ణవంశీ. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పటికే అత్తారింటికి దారేది అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా రావడం ఆ సినిమాను పోలి ఉన్నట్లు ఈ సినిమా కథ కొంతమేర ఉండటం వలన తాత ఇంటికి దారేది అని ట్రోల్స్ కూడా ఈ సినిమా విషయంలో వినిపించాయి.

Krishna Vamsi With Ram Charan

- Advertisement -

ఇక రీసెంట్ గా రంగమార్తాండ అనే సినిమాకు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కృష్ణవంశీ. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఇకపోతే కృష్ణవంశీ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి నెటిజన్ కి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా రాంచరణ్ తో సినిమా ఎప్పుడు అని అడిగినప్పుడు. రామ్ చరణ్ తో సినిమా చేయడానికి నేను రెడీ గానే ఉన్నాను. కానీ ఆయన బిజీగా ఉన్నారు ఆ మెగా బిజీ అలా కొనసాగించినవ్వండి అంటూ రిప్లై ఇచ్చాడు. ఇకపోతే రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. రామ్ చరణ్ తో సినిమా చేయాలి అంటే ఆ కథ వస్తువు కూడా అంతే ధీటుగా ఉంటే తప్ప సినిమా వర్కౌట్ కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు