Krithi shetty: టాలీవుడ్ కి బై బై చెప్పేసిన కృతి శెట్టి.. కారణం అదేనా..?

ప్రముఖ కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందం, అభినయం ఈమె సొంతం.. ఈ బ్యూటీని దర్శకుడు బుచ్చిబాబు ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె తన అందంతో అందరినీ ఆకట్టుకొని మంత్రముగ్ధుల్ని చేసింది.మరోవైపు తన నటనతో అందరినీ ఆకట్టుకునీ ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ అందుకున్న ఈమె వరుసగా ఆఫర్లను అందుకుంది. అందులో భాగంగానే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ..

ఇకపోతే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ కూడా.. డిజాస్టర్ గా నిలవడంతో.. ఇక ఈమె ఫేడ్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. ఇక ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడం. చివరిగా వచ్చిన కస్టడీ సినిమా కూడా ఘోర పరాభవం పొందడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే టాలీవుడ్ లో ఎన్నో ఆశల మధ్య శర్వానంద్ తో మనమే అనే సినిమాలో నటించి అలరించే ప్రయత్నం చేసింది.. అయితే ఈ సినిమా కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా కూడా ఇప్పుడు ఫ్లాప్ అవడంతో ఈమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళంలో ప్రస్తుతం భారీగా ఆఫర్లు వస్తున్నట్లు ఇప్పటికే మూడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది… ఈ క్రమంలోనే ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు ఎండ్ కార్డు వెయ్య నుందని సమాచారం..

కృతి శెట్టి నటించిన యాడ్స్..

Krithi Shetty: Krithi Shetty said bye bye to Tollywood.. Is that the reason..?
Krithi Shetty: Krithi Shetty said bye bye to Tollywood.. Is that the reason..?

2003 సెప్టెంబర్ 21 కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది ఈ ముద్దుగుమ్మ ఈమె తండ్రి పేరు కృష్ణ శెట్టి, తల్లి పేరు నీతి శెట్టి.. చిన్ననాటి నుండే ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో కూడా నటించింది.. ఇక చదువు అనంతరం అప్పుడప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమెకు హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 సినిమాలో స్టూడెంట్ గా నటించే అవకాశం రాగా.. అలా అవకాశాన్ని ఒడిసి పట్టుకొని.. అందులో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే 2021 లో వచ్చిన ఉప్పెన సినిమాతోనే బేబమ్మ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

కృతి శెట్టి సినిమాలు..

ఒకవైపు బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ లతో హ్యాట్రిక్ కొట్టి ఆ తర్వాత దివారియర్,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ , మనమే వంటి చిత్రాలతో ఘోర పరాభవాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మలయాళం లో కూడా ఈమె అజాయింతే రాండం మోక్షణం అనే సినిమాలో నటిస్తోంది.. మరొకవైపు కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు