Kriti sanan.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti sanan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగులో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ , ఆ తర్వాత నాగచైతన్య (Naga Chaitanya) తో కలిసి దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ అవకాశాలు అందుకోలేకపోయింది.ఈ సినిమా డిజాస్టర్ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఈమెకు అక్కడ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన అందచందాలతో నటనతో మెప్పించింది.
రిలేషన్ షిప్ లో కృతి సనన్..
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ సినిమాలలో ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ఆది పురుష్ అనే సినిమాలో సీతగా నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ సమయంలో హీరో ప్రభాస్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు రాగా, వాటిని కొట్టిపారేసింది.. అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ ఈమె రిలేషన్ లో ఉందంటూ చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ రిలేషన్షిప్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంది.
రిలేషన్ షిప్ పై కామెంట్స్..
కృతి సనన్ మాట్లాడుతూ.. రిలేషన్ షిప్ లో గొడవలు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. గొడవలు ఏదో రకంగా జరుగుతాయి. కానీ ఆ గొడవ జరిగినప్పుడు అందులో నా తప్పు ఉంటే తప్పకుండా నేనే వెళ్లి ముందు క్షమాపణలు కోరుతాను. లేకపోతే అసలు క్షమాపణలు అడగను అంటూ తెలిపింది. సారీ చెప్పకపోయినా దాన్ని ఏదో ఒక రకంగా సాల్వ్ చేయాలనుకుంటాను అంతే తప్ప దానిని పెద్దది చేసి , ఆ సమస్యను మరింత ఎక్కువ చేయాలని అనుకోను అంటూ తెలిపింది. అంతేకాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉందని తెలిస్తే మాత్రం ముఖ్యంగా నాకు సంబంధించినది అయితే సమస్యను అలాగే వదిలేయకుండా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనుషులతో సత్సంబంధాలు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అంటూ తెలిపింది కృతి సనన్.
బాధ ఎక్కువైతే ఏడ్చేస్తా..
గొడవ జరిగినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నాకు కన్నీళ్లు రావు అని చెప్పను. అలాగే అసలు ఏడవను అని కూడా చెప్పను అలా అని ప్రతి చిన్న విషయానికి కూడా ఏడవను. ఎక్కువగా బాధ వచ్చి తట్టుకోలేకపోయిన సందర్భాలలో మాత్రమే ఏడుస్తాను..ఎవరితోనైనా గొడవపడితే వెంటనే నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి అంటూ తెలిపింది కృతి సనన్. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.