Kriti Sanon : టీజర్ తో అంచనా వేయలేం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పెద్ద సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని టీం భావించారు. కానీ ఇటీవల విడుదల చేసిన టీజర్ కి అనుకున్నంత రీచ్ రాలేదు. ఇంకా చెప్పాలంటే విమర్శలు కూడా వచ్చాయి. సినిమాలో వీఎఫ్ఎక్స్ కీలకం అని చెప్పారు. కానీ టీజర్ లో ప్రేక్షకులు మెచ్చే విధంగా వీఎఫ్ఎక్స్ లేదు.

దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆదిపురుష్ 3D వెర్షన్ లోనే చూడాలని, మొబైల్స్ లో చూస్తే ఫీల్ రాదని చెప్పుకొచ్చారు. అలాగే కొంత మంది ఫ్యాన్స్ కి 3D వెర్షన్ టీజర్ ను కూడా చూపించారు. దీనివల్ల పరిస్థితి కొంత వరకు మారింది. కానీ, చాలా మందిలో అసహనం పోలేదు. దీంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మరింత బడ్జెట్ ను కేటాయించి వీఎఫ్ఎక్స్ ను పకడ్భందీగా చేస్తున్నారు. అవసరమైతే కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా తాాజాగా దీనిపై ఆదిపురుష్ లో సీత పాత్ర చేసిన కృతి సనన్ స్పందించింది. ఆదిపురుష్ సినిమాలో భాగం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తనతో పాటు టీం మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారని తెలిపింది. అయితే కేవలం టీజర్ తో సినిమా మొత్తాన్ని అంచనా వేయలేమని అన్నారు. ఆదిపురుష్ ను గ్రాండ్ విజువల్స్ తో భారీ స్థాయిలో డైరెక్టర్ ఓంరౌత్ ప్లాన్ చేసాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సినిమాను మరింత మెరుగ్గా చేయడానికి వర్స్ జరుగుతున్నాయని, దీంతో సినిమా ఫలితం ఇంకా బాగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు