Kriti Sanon: కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసిన కృతి… బాయ్ ఫ్రెండ్ లో ఆ లక్షణాలు ఉన్నాయా?

Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్తూ మనసులోని మాటలు బయట పెట్టింది. మరి ఆమె కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే..

బిజినెస్ మ్యాన్ తో కృతి డేటింగ్..

ఈ సంవత్సరం మొదట్లో కృతి సనన్ లండన్‌ వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే కృతి మాత్రం ఆ వార్తలను కొట్టి పారేసింది. అయితే ఆమె ఫ్యాన్స్ సంతోషించే వార్త ఏంటంటే కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల లిస్ట్ ను బయట పెట్టింది. ఫ్యూచర్ హజ్బెండ్ తనను బాగా నవ్వించే వ్యక్తిగా ఉండాలని, హానెస్ట్ గా ఉండాలని చెప్పుకొచ్చింది.

కృతికి కాబోయే భర్త ఇలా ఉండాలట

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ “నా ఆలోచనలకు తగ్గ అబ్బాయి దొరుకుతాడా? అనేది నాకు తెలియదు. నాకు ఇది కావాలి, అది కావాలి అంటూ మనం చాలా ఒత్తిడికి లోనవుతున్నాము. ఆ ఒత్తిడి అనేదే లేకుండా చూసుకునే వ్యక్తి భర్తగా దొరికితే బాగుంటుంది. నాకు కూడా కొన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి కావాలని మైండ్ లో ఉంది. అతను హానెస్ట్ అయ్యి ఉండాలి. నన్ను నవ్వించగల వ్యక్తితో అయితే బాగా కనెక్ట్ అవుతాను. నేను ఎవరితో ఉన్నా నన్ను, నా పనిని గౌరవించే వ్యక్తి కావాలి. అలాంటి వారే నాతో గంటల తరబడి మాట్లాడగలరు. ఈ లక్షణాలన్నీ ఉన్న అబ్బాయి మాత్రమే కావాలని అనుకోను. కానీ నన్ను ఓన్ చేసుకోవడంతో పాటు వాళ్ళ దగ్గర నేను సేఫ్ గా ఫీల్ అయ్యేలా చూసుకునే వ్యక్తి కావడం ముఖ్యం” అంటూ కాబోయే భర్త పట్ల తనకున్న ఊహాలన్నీ ఏకరువు పెట్టేసింది. దీంతో మరి నీ బాయ్ ఫ్రెండ్ కు ఈ లక్షణాలన్నీ ఉన్నాయా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

బాయ్ ఫ్రెండ్ తో హోలీ సంబరాలు

కబీర్ బహియాతో కలిసి కృతి లండన్‌లో హోలీ జరుపుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు బయల్దేరాయి. సమాచారం ప్రకారం కబీర్ లండన్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు అని తెలుస్తోంది. అలాగే కబీర్‌కి సాక్షి ధోనీకి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఈ రూమర్స్ పై కృతి లేదా కబీర్ ఇంకా స్పందించలేదు.

కృతి సినిమాల విషయానికొస్తే.. కృతి సనన్ ప్రస్తుతం విడుదలైన క్రూ చిత్రం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ బ్యూటీ క్రూ మూవీలో కరీనా కపూర్ ఖాన్, టబుతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇన్-ఫ్లైట్ సూపర్‌వైజర్ గీతా సేథి (టబు), సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ జాస్మిన్ రానా (కరీనా కపూర్), జూనియర్ ఫ్లైట్ అటెండెంట్ దివ్య బజ్వా (కృతి సనన్) పాత్రల్లో మెరిశారు. కృతి త్వరలో కాజోల్‌తో కలిసి క్రైమ్ థ్రిల్లర్ దో పత్తిలో కనిపించనుంది. దో పట్టి సినిమాకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నిర్మాతగా ఆమెకు ఇదే మొదటి చిత్రం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు